ఆంగ్ల భాష ప్రావీణ్యంపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ

ఆంగ్ల భాష ప్రావీణ్యంపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ స్వీయ ఆన్‌లైన్‌ శిక్షణను నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పాఠశాల లకు సెలవులు ప్రకటించినందున ఉపాధ్యాయులకు ఈ శిక్షణ చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం 1-6 తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్పు చేస్తున్నందున



 ఉపాధ్యాయుల్లో ఆంగ్ల అభ్యా సన మెలకువలను పెంచేందుకు దీన్ని తీసుకొచ్చారు. 'బోధ్‌-శిక్ష లోక్‌ యాప్‌ ద్వారా స్వీయ శిక్షణను కొన సాగిస్తోంది. ఏప్రిల్‌ 24వరకు ఈ శిక్షణ కొనసాగ నుంది.



 యాప్‌లో అభ్యాసన మెటీరియల్‌, వీడియోల తోపాటు ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని అంచనా వేసేం దుకు రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆంగ్ల భాష ప్రావీణ్యంపై ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ శిక్షణ"

Post a Comment