వాట్సప్లో పరీక్ష ఫలితాలు
దిల్లీ:
దేశ ప్రజలని కరోనా వణికిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఇప్పటికీ
దిల్లీలో పాఠశాలల్ని, విద్యా సంస్థలని మూసివేశారు. కరోన భయంతోనే అక్కడి
విద్యార్థులకి ఫలితాలను వినూత్నంగా తెలియజేయాలని నిర్ణయించుకున్నాయి.
అందుకోసం దిల్లీలోని కేంద్రీయ విద్యాలయాల్లో చదివే విద్యార్థులకి వాట్సప్,
ఈ మెయిల్ ద్వారా పరీక్ష ఫలితాలను పంపేందుకు సిద్ధపడుతున్నాయి. సాధారణంగా
విద్యార్థుల చేతికే ఫలితాలను అందించేవారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటం
వల్ల వీలయినంత వరకు విద్యార్ధులను తాకకుండా ఉండటమే ఉత్తమమని అధికార
వర్గాలు తెలియజేశాయి. దీంతో అక్కడ అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయల్లో
ఫలితాలను నేరుగా కాకుండా ఈ మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా చేరేవేసేందుకు
ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ వెలువడిన ఫలితాలలో ఏదైనా సందేహాలు ఉంటే
వాటిని
పరిష్కరించేందుకు పాఠశాలలు ఫోన్లో అందుబాటులో ఉంటాయని
తెలిపారు.దిల్లీ అధికారి ఒకరు మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయలతో పాటు
ఇంకొన్ని విద్యాసంస్థలు కూడా ఈ విధానాన్నే అనుసంచేందుకు యోచిస్తున్నాయని
తెలిపారు.కరోనా కారణంగా దిల్లీలో విద్యాసంస్థలు అన్ని మార్చ్ 31 వరకు
మూసివేశారు. అప్పటికీ పరిస్థతులు ఇలానే ఉంటే మరిన్నీ రోజులు పొడిగించే
అవకాశం ఉందని దిల్లీ అధికారులు తెలిపారు
0 Response to "వాట్సప్లో పరీక్ష ఫలితాలు"
Post a Comment