ఎస్‌బీఐలో కనీస నిల్వ అక్కర్లేదిక




 ఎస్‌బీఐలో కనీస నిల్వ అక్కర్లేదిక

 ఖాతాదార్లకు అతిపెద్ద ఊరట ఇది
 సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాపై వడ్డీ 3 శాతమే
 డిపాజిట్‌, రుణ రేట్లూ తగ్గింపు


State బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. పొదుపు (ఎస్‌బీ) ఖాతాలో కనీస నిల్వ లేకపోతే, జరిమానా విధించే నిబంధనను రద్దు చేసింది. ఇది వినియోగదార్లకు అతిపెద్ద ఊరటగా చెప్పవచ్చు. ఇప్పటిదాకా సగటు నెలవారీ నిల్వ (ఏఎమ్‌బీ) లేని ఖాతాదార్ల నుంచి అపరాధ రుసుము వసూలు చేశారు. ఇకపై ఖాతాలో కనీస నిల్వ లేకున్నా ఈ బాధ ఉండదు. పట్టణ, పాక్షిక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఈ కనీస నిల్వ  ప్రస్తుతం రూ.3,000; రూ.2000; రూ.1000గా ఉంది. ఖాతాలో కనీసం ఇంతమొత్తం లేకపోతే రూ.5-15 వరకు అపరాధ రుసుము (పన్నులు అదనం) విధిస్తున్నారు. మిగతా బ్యాంకులూ ఈ దారిలో నడిస్తే తక్కువమొత్తం ఆదాయం ఉండే ఖాతాదార్లకు భారం తగ్గుతుంది.



* ‘వినియోగదారుడే తొలి ప్రాధాన్యం’ అంశాన్ని గుర్తుపెట్టుకుని బ్యాంకు ఎస్‌ఎమ్‌ఎస్‌ ఛార్జీలను సైతం రద్దు చేసింది.
* అన్ని సేవింగ్స్‌ బ్యాంక్‌(ఎస్‌బీ) ఖాతాల్లోని నగదుపై 3 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలని బ్యాంక్‌ నిర్ణయించింది. ప్రస్తుతం రూ.లక్ష వరకు నిల్వలపై 3.25% వడ్డీ; రూ.లక్ష పైన 3 శాతం వడ్డీ ఇస్తోంది. అంటే రూ.లక్షలోపు నిల్వలున్న వారు ఇపుడు 0.25 శాతం వడ్డీ కోల్పోతారు.
* రూ.2 కోట్ల కంటే తక్కువగా ఉన్న రిటైల్‌ కాలిక డిపాజిట్లపై 10-50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేటులో కోత వేసింది. ఏడాదిపైన.. రెండేళ్లలోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 6 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గించింది. సీనియర్‌సిటిజన్లకు 6.5 శాతం బదులుగా 6.4 శాతం వర్తిస్తుంది.
* రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలపైనా డిపాజిట్‌ రేట్లను 15 బేసిస్‌పాయింట్ల మేర తగ్గించింది. ఏడాది, ఆ పైన వ్యవధి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 4.75 శాతం నుంచి 4.6 శాతానికి కుదించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఎస్‌బీఐలో కనీస నిల్వ అక్కర్లేదిక"

Post a Comment