కరోనాను ఎదుర్కొనేందుకు 11 బృందాలు

దిల్లీ: కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్రం 11 సాధికారిక బృందాలను ఏర్పాటు చేసింది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం బృందాల ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని కార్యాలయం, కేబినెట్ సచివాలయంలో ఉన్న సీనియర్ అధికారులతో కలిపి ఈ బృందాలను ఏర్పాటు చేశారు. కొవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూ



రూపొందించడంసమయానుసారంగా అమలు చేయడానికి అన్నిరకాల చర్యలు తిసుకునే అధికారం కేంద్రం ఈ బృందాలకు ఇచ్చింది. నిత్యావసరాలు సహా అన్ని సేకరణ విషయాలలో ఈ బృందాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రధాని కార్యాలయం, కేబినెట్ సచివాలయం ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమన్వయ పరచనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీటిలో 8 బృందాలకు కార్యదర్శి స్థాయి 


అధికారులు, రెండు బృందాలకు నీతి ఆయోగ్ సభ్యులు, ఒక బృందానికి నీతి ఆయోగ్ సీఈఓ నేతృత్వం వహించనున్నట్లు కేంద్రం తెలిపింది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కరోనాను ఎదుర్కొనేందుకు 11 బృందాలు "

Post a Comment