కొత్త జిల్లాలు ఇప్పట్లో కుదరదు

  • వచ్చే ఏడాది మార్చి 31దాకా ఆగాలి
  • జనగణన త్వరలోనే ప్రారంభం
  • రాష్ట్రానికి జనాభా లెక్కల డైరెక్టర్‌ లేఖ
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): త్వరలో 2021 జనాభా లెక్కల గణన జరగనుందని, అది ముగిసే వరకు పరిపాలనా విభాగాల(అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్స్‌) సరిహద్దులను మార్చవద్దని కేంద్ర హోం శాఖ పరిధిలోని జనాభా లెక్కల డైరెక్టరేట్‌ రాష్ట్రప్రభుత్వానికి లేఖరాసింది.



 జిల్లా, రెవెన్యూ డివిజన్‌, మండలం, గ్రామాలు.. పరిపాలనా విభాగాల కిందకే వస్తాయి. జనాభా లెక్కలు పూర్తయ్యేవరకు.. అంటే వచ్చే ఏడాది మార్చి 31 దాకా సరిహద్దులు మార్చే కార్యక్రమం చేపట్టవద్దని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శికి డైరెక్టర్‌ సూచించారు. 



దీని ప్రకారం రాష్ట్రప్రభుత్వం ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. రెవెన్యూ డివిజన్‌, మండలాలు, గ్రామాల వారీగా విభజన చేపట్టకూడదు. 



జనాభాలెక్కలుగిసేవరకు ఇప్పుడున్న యథాతథ స్థితినే కొనసాగించాలి. ుఈ ఏడాది ఏప్రిల్‌, సెప్టెంబరు మాసాల్లో ఇంటింటి గణన, ఇళ్ల లెక్కల గణన, జనాభా రిజిస్టర్‌ తాజాపరచడం వంటివి ప్రారంభం కానున్నాయి. 




ఫిబ్రవరి 9 నుంచి జనాభా లెక్కల కార్యక్రమం మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి 1 నుంచి 10వ తేదీ వరకు రివిజన్‌ జరగనుంది. కాబట్టి వచ్చే ఏడాది మార్చి 31 దాకా పాలనా యూనిట్ల విషయంలో యథాతథ స్థితినే కొనసాగించాలి్‌ అని డైరెక్టర్‌ స్పష్టం చేశారు. దీంతో ఈ అంశాన్ని రెవెన్యూ శాఖ ప్రభుత్వం దృష్టికి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " కొత్త జిల్లాలు ఇప్పట్లో కుదరదు"

Post a Comment