బడ్జెట్లో వేతనాలు, నవరత్నాలే!

  • పెండింగ్‌ బిల్లుల చెల్లింపుపై అనిశ్చితి
  • మౌలిక, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు నిల్‌?
  • ప్రారంభమైన ప్రీ బడ్జెట్‌ సమావేశాలు


అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లోనూ ‘నవరత్నాలకే’ పెద్దపీట వేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఉద్యోగుల వేతనాలు, నవరత్నాలకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాక.. మిగిలిన అవసరాల గురించి ఆలోచించాలని అనుకుంటున్నారు. ఈ మేరకు సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజుతో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్‌ రెడ్డి సచివాలయంలో ప్రీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో నవరత్నాల పథకాలకు సరిపోయే కేంద్ర పథకాలేవైనా ఉంటే ఆ నిఽధులను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కేంద్రం నుంచి ఏపీకి హక్కుగా రావాల్సిన నిధులను సమర్థంగా తెచ్చుకోవాలని భావిస్తున్నారు. కేంద్రం బడ్జెట్లో ఏపీకి మొండి చేయి చూపడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. రావాల్సిన నిధులు ఇవ్వకపోగా, కత్తెర వేయడం రాష్ట్ర ఆర్థిక కష్టాలు మరింత తీవ్రం కానుంది. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవితో కూడా ప్రీ బడ్జెట్‌ సమావేశాలు జరగాల్సి ఉన్నా వారు రాకపోవ డంతో వాయిదా పడ్డాయి. మంగళవారం రోడ్లుభవనాలశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌తో ఆర్థిక మంత్రి ప్రీబడ్జెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. నవరత్నాలే తొలి మలి ప్రాధాన్యాలుగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాలని ఈ సమావేశాల్లో ఆర్థిక మంత్రి, అధికారులు చెప్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " బడ్జెట్లో వేతనాలు, నవరత్నాలే!"

Post a Comment