ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధి
- ఏపీఎన్జీవో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి
- రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక
- జింఖానా మైదానంలో ప్రమాణస్వీకారం
గవర్నర్ పేట, ఫిబ్రవరి 2: ఉద్యోగుల
సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు
ఎన్.చంద్రశేఖరరెడ్డి అన్నారు. రాష్ట్ర సంఘానికి ప్రస్తుతం అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులు పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీనివాసరావు
తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చంద్రశేఖరరెడ్డి, బండి శ్రీనివాసరావు
నేతృత్వంలోని ప్యానెల్ ఆదివారం నామినేషన్లు వేశారు. ఎన్నిక ఏకగ్రీవం
కావడంతో గాంధీనగర్ జింఖానా మైదానంలో వేలాది మంది ఉద్యోగుల సమక్షంలో ప్రమాణ
స్వీకారం చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
పరిపాలన
వికేంద్రీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని
చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఎక్కడికెళ్లి పనిచేయడానికైనా ఉద్యోగులు సిద్ధంగా
ఉన్నారని, ఉద్యోగులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఇతర
సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ఏపీఎన్జీవో సంఘ
డిమాండ్లను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన
వ్యక్తం చేశారు.
సమస్యలపై రాజీలేని పోరాటం
ఏపీఎన్జీవో
సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగుల
సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం వద్ద
పెండింగ్లో ఉన్న డీఏ, పీఆర్సీ అమలు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ,
అవుట్ సోర్సింగ్, సీపీఎస్ విధానాల రద్దు అంశాలపై చర్చలు
కొనసాగిస్తామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62
ఏళ్లకు పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంతో పాటు తెలుగు
మీడియాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. నూతన కార్యవర్గాన్ని
జేఏసీ, ట్రేడ్ యూనియన్, వివిధ శాఖల ఉద్యోగ సంఘాల నాయకులు అభినందించారు.
ఎరుపెక్కిన బందరు రోడ్డు
జిల్లాల
నుంచి నగరానికి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ఆదివారం ఎంజీ రోడ్డులోని
ఠాగూర్ స్మారక గ్రంథాలయం నుంచి గాంధీనగర్లోని సంఘం కార్యాలయానికి
ప్యానల్ అభ్యర్థులను ఊరేగింపుగా తీసుకువచ్చారు. చంద్రశేఖరరెడ్డి ప్యానల్
అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని ఎన్నికల అధికారి
జి.రామకృష్ణారెడ్డి ప్రకటించారు.
ఎన్నికైన కార్యవర్గం ఇదే ..
సంఘ
రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్.చంద్రశేఖరరెడ్డి (జైళ్లశాఖ), సహాధ్యక్షుడిగా
చౌదరి పురుషోత్తం నాయుడు(వాణిజ్య పన్నులశాఖ), ఉపాధ్యక్షులుగా డీవీ రమణ,
వై.రమణ, పి.శ్రీనివాసరావు, వి.దస్తగిరి, బి.నాగకిషోర్,
ఎం.పరమేశ్వరరావు(వైద్య ఆరోగ్యశాఖ), డి.ధనుంజయనాయుడు(న్యాయశాఖ), టీవీ
రామిరెడ్డి(వ్యవసాయశాఖ), ప్రధాన కార్యదర్శిగా బండి
శ్రీనివాసరావు(జలవనరులశాఖ), కార్యనిర్వాహక కార్యదర్శిగా సీహెచ్
అజయ్కుమార్(అర్థగణాంకశాఖ), ప్రచార కార్యదర్శిగా బి.కృపావరం (దేవదాయశాఖ),
కార్యదర్శులుగా జె.జగదీశ్వరరావు, సీహెచ్ వెంకటేశ్వరరెడ్డి(జలవనరులు),
కె.వసంతరావు (కార్మికశాఖ), బి.జానకి(ఆయుష్శాఖ), వి.సుబ్బారెడ్డి (వైద్య
ఆరోగ్యశాఖ), మహిళా కార్యదర్శిగా బి.తులసీరత్నం(సర్వే అండ్ ల్యాండ్
రికార్డుశాఖ), కోశాధికారిగా ఎం.వెంకటేశ్వరరెడ్డి(పే అండ్ అకౌంట్స్) ఏక
గ్రీవంగా
0 Response to " ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధి "
Post a Comment