హైస్కూల్ స్టూడెంట్ పనికి టీచర్ ఫిదా
వాషింగ్టన్: ఇతరుల
పట్ల మనిషికి కొంచెమైనా ఉదారత అవసరం. తనకు సరిపడా ఉన్నప్పుడు ఎదుటివారికి
చేయూతనివ్వడమే ఉదారత. ఇక అమెరికాలోని ఓ విద్యార్థి చూపిన ఔదార్యం నెటిజన్ల
ప్రశంసలు పొందుతోంది. హైస్కూల్ టాప్ విద్యార్థి ఒకరు పరీక్షలో తనకు
వచ్చిన బోనస్ పాయింట్లను తక్కువ మార్కులు వచ్చిన వారికి జత చేయండని
టీచర్కు విజ్ఞప్తి చేశాడు. ఈమేరకు ఎగ్జామ్ పేపర్పైనే రాసిపెట్టాడు. సదరు
A+ స్టూడెంట్ పనికి క్లాస్ టీచర్ విన్స్టన్ లీ ఫిదా అయ్యాడు. సోషల్
మీడియాలో టీచర్ ఆ వివరాలను పోస్టు చేయడంతో వైరల్ అయింది
94 మార్కులు సాధించిన A+ విద్యార్థికి బోనస్గా ఐదు పాయింట్లు వస్తాయి.
దాంతో అతని స్కోరు 99 అవుతుంది. కానీ, తమ తరగతిలో తక్కువ మార్కులు పొంది
ఇబ్బంది పడుతున్నవారికి అతని బోనస్ పాయింట్లు జత చేయాలని A+ విద్యార్థి
కోరాడు. అతని ప్రేమమయ ప్రవర్తన నాకు ముచ్చటేస్తుంది. కేవలం ఇతరులకు సాయం
చేయాలనే తలంపే అతనికి ఈ ఆలోచన కల్పించింది. A+ విద్యార్థి విజ్ఞప్తి మేరకు ఓ
బాలికకు ఆ 5 మార్కులు జత చేశాను. దాంతో ఆమె కూడా A+ గ్రేడ్ పొందింది.
మామూలుగా ఇలా ఎవరూ చేయరు. కానీ, A+ విద్యార్థి విన్నపాన్ని కాదనలేకపోయాను’
అని విన్స్టన్ లీ చెప్పుకొచ్చారు. (
Its a good news for students specially who is searching for Pay Someone To Take My Accounting Class to save time.
ReplyDeleteI am a researcher and now looking for a kfc swot analysis. If anyone is interested in writing, you can contact them here.
ReplyDelete