2003-డీఎస్సీ టీచర్లకు గుడ్ న్యూస్

2003-డీఎస్సీ టీచర్లకు గుడ్ న్యూస్! 

       2003-డీఎస్సీ టీచర్లకు బిగ్ గుడ్ న్యూస్! ఇప్పటివరకు వారంతా కొత్త పెన్షన్ పథకం(CPS)లో కొనసాగుతున్నారు. ఈ రోజు Government of India, Department of Pension and PM Memorandum No 57/04/2019-P&PW(B) తేదీ 17.02.2020 ద్వారా ఒక విష్పష్టమైన వివరణ ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు కొత్త పెన్షన్ పథకం ఫస్ట్ జనవరి, 2004 నుంచి అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే!  ఈ రోజు GOI జారీచేసిన క్లారిఫికేషన్ ప్రకారం.... ఫస్ట్ జనవరి, 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకూ ఓల్డ్ పెన్షన్ స్కీం వర్తించనుంది. అయితే, దీనికి కండిషన్ ఏంటంటే.... సదరు నియామకాలకు సంబంధించిన టెస్ట్/ఎక్జామ్ ఫలితాలు ఫస్ట్ జనవరి, 2004 కి ముందే ప్రకటించబడి ఉండాలి. అంటే, OPS వర్తించాలంటే.... CPS విధానం అమల్లోకి రావడానికి ముందు నియామకాలు జరగకపోయినా ఫర్లేదు కానీ, ఫలితాలు మాత్రం వెల్లడి కావాలన్న మాట! సదరు ఉద్యోగులు ఈ ఏడాది మే 31లోగా CPSలోకి మారడానికి ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఆప్షన్ ఇవ్వని పక్షంలో CPSలోనే కొనసాగుతారు. 





    ఇప్పుడు మన రాష్ట్రం విషయానికి వద్దాం! మన రాష్ట్రంలో తేదీ 1-9-2004 నుంచి CPS విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఫస్ట్ సెప్టెంబర్ 2004న లేదా ఆ తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు CPS వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే! అయితే, 2003 డీఎస్సీ నియామకాలు నవంబర్, 2005లో జరిగినప్పటికీ, ఫలితాలు మాత్రం జూన్, 2004 (Subject to correction) లోనే ప్రకటించారు. అంటే, రాష్ట్రంలో CPS విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు. కాబట్టి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు OPS అమలు కావడం తథ్యం. 💐💐🌹🌹




✍మానేటి ప్రతాపరెడ్డి.

Additional information


*📚✍2003-డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం!*

*🌻ఈనాడు, న్యూస్ :* కేంద్ర ప్రభుత్వ పింఛను వ్యవహారాల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయులకు ఊరట కలిగించనున్నాయి. వారికి పాత పింఛన్‌ పథకం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 జనవరి 1 నుంచి సీపీఎస్‌ అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004 జనవరి 1వ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత పింఛన్‌ పథకం వర్తిస్తుంది. అయితే సదరు నియామకాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు 2004 జనవరి 1వ తేదీ కంటే ముందు ప్రకటించి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి సీపీఎస్‌ విధానం అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం 2004 సెప్టెంబరు 1 నుంచి నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ వర్తిస్తుంది. కాగా 2003 డీఎస్సీ నియామకాలు 2005 నవంబరులో జరిగాయి. ఫలితాలు మాత్రం 2004 జులై నెలలోనే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీపీఎస్‌ విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించినందున వారికి పాత విధానం అమలు చేయాల్సి ఉంటుందని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు తెలిపారు. ఆ డీఎస్సీ ద్వారా రెండు రాష్ట్రాల్లో 16,449 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

 Old పింఛన్‌ పథకం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యో
గులకు 2004 జనవరి 1 నుంచి సీపీఎస్‌ అమల్లోకి
వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసిన
ఉత్తర్వుల ప్రకారం 2001 జనవరి 1వ తేదీ తర్వాత
నియామకమైన ఉద్యోగులకూ పాత పింఛన్‌ పథకం
వర్తిస్తుంది. అయితే సదరు నియామకాలకు సంబం
ధించిన పరీక్ష ఫలితాలు 2004 జనవరి 1వ తేదీ
కంటే ముందు ప్రకటించి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్ర
దేశ్‌లో 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి సీపీఎస్‌
విధానం అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం 200%
సెప్టెంబరు 1 నుంచి నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్‌ వర్తిస్తుంది.
కాగా 2008 డీఎస్సీ నియామకాలు 2005 నవంబరులో
జరిగాయి. ఫలితాలు మాత్రం 2004 జులై నెలలోనే
ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రలో సీపీఎస్‌
విధానం అమల్లోకి రాకముందే [008 డీఎస్సీ ఫలితాలు
ప్రకటించినందున. వారికి పాత విధానం అమలు
చేయాల్సి ఉంటుందని టీఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర గౌరవ
అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర
అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు తెలిపారు. ఆ డీఎస్సీ ద్వారా
రెండు రాష్ట్రాల్లో 16,449 మంది ఉపాధ్యాయులు
నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల
నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "2003-డీఎస్సీ టీచర్లకు గుడ్ న్యూస్"

Post a Comment