కమీషనర్, పాఠశాల విద్యాశాఖ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం: శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఏ.ఎస్
లా
ఆర్.సి.నం: ఇ ఎస్ ఇ 02-2802/1/ 121/ 2019-ప్లానింగ్/సి.ఎస్.ఇ తేది: 26.1.2020
విషయం: పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణను
మెరుగుపర్చడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేయడం-
గురించి
ఆదేశములు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 44,570 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో
చదువునభ్యసిస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా బాలికల వ్యక్తిగత పరిశుభ్రత దృష్ట్యా పాఠశాలల్లోని
పారిశుద్ద గదుల్ని సక్రమంగా నిర్వహించవలసిన ఆవశ్యకత ఉన్నది.
ధ్
2. జనవరి 9 వ తేదీనాడు చిత్తూరులో అమ్మఒడి కార్యక్రమం ప్రారంభిస్తూ గౌరవనీయులైన
ముఖ్యమంత్రిగారు తల్లులందరికీ ఈ సందర్భంగా ఒక పిలుపునిచ్చారు. అమ్మజఒడి కార్యక్రమం
కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం పొందిన తల్లులు తమకు అందిన ఆర్థిక సహాయంలో
తమ వంతు విరాళం కింద రు.1000/- (అక్షరాలా వెయ్యి రూపాయలు) పాఠశాల తల్లిదండ్రుల
కమిటీకి అందచేయగలందులకు, ఆ విధంగా జమచేసిన సొమ్ముతో తల్లిదండ్రుల కమిటీలు
పాఠశాలలోని పారిశుద్ధ్యగదుల నిర్వహణకు తగిన చర్యలు చేపట్టగలందులకీ వారు విజ్ఞప్తి
చేసియున్నారు.
3. _ కాబట్టి, గౌరవనీయ ముఖ్యమంత్రిగారు ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాలల తల్లిదండ్రుల
కమిటీలు తదుపరి చర్యలు తీసుకోవడం కోసం ఈ దిగువ చూపిన విధంగా చర్య చేపట్టవలసిందిగా
ఆదేశించనైనది.
CLICK HERE TO DOWNLOAD
* పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 30.01.2020న తల్లిదండ్రుల సమావేశాన్నిఏర్పాటు చేసి,
పాఠశాలల పారిశుద్ధ్య నిర్వహణ గురించి తీసుకోవలసిన చర్యలను వివరించి అది
తల్లిదండ్రుల బాధ్యతగా వారికి విశదీకరించాలి.
0 Response to " పాఠశాల విద్య-పాఠశాలల్లో పారిశుద్ధ్య గదులు శుభ్రత నిర్వహణను మెరుగుపర్చడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు"
Post a Comment