ఏపీలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు
అమరావతి: ఏపీలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నిర్వహిస్తు్న్న పరిశ్రమల శాఖ నుంచి ఆహారశుద్ధి విభాగాన్ని
వేరు చేసి దాన్ని కూడా కన్నబాబుకే అప్పగించారు. మార్కెటింగ్ శాఖను కన్నబాబుకు అప్పగించడంతో ప్రస్తుతం మోపిదేవి వద్ద పశుసంవర్ధక, మత్స్యశాఖలు మాత్రమే ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం మంత్రుల శాఖల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది
0 Response to "ఏపీలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు"
Post a Comment