నేటి నుంచి ‘మధ్యాహ్న భోజనం’ కొత్త మెనూ

విశాఖపట్నం: పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజన పఽథకానికి సంబంధించిన నూతన మెనూ మంగళవారం నుంచి అమలు కానుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా సంచాలకుడి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి 



బి.లింగేశ్వరరెడ్డి జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖాధికారులకు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సోమవారం అన్నం, పప్పుచారు, గుడ్డుకూర, చిక్కి, మంగళవారం పులిహోర, టమాటా పప్పు, ఉడికించిన గుడ్డు, బుధవారం కూరగాయలతో అన్నం, ఆలూ కూర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి, గురువారం కిచిడి, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి, శనివారం అన్నం, సాంబారు, స్వీట్‌ పొంగలి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతన మెనూను అన్ని పాఠశాలల్లోను ప్రదర్శించాలన్నారు. నూతన మెనూ విషయం అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం 



కల్పించాలని పేర్కొన్నారు. ఉప విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షణ సెక్టోరల్‌ అధికారులు, మండల విద్యాశాఖాధికారులు, సీఆర్పీలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యే మధ్యాహ్నభోజన పథకం నూతన మెనూ అమలు కార్యక్రమంలో ఏదో ఒక పాఠశాలలో తప్పని సరిగా పాల్గొనాలని సూచించారు. కార్యక్రంలో ఏదో ఒక పాఠశాలలో పాల్గొనేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ముగ్గురు, ప్రధానోపాధ్యాయుడు కమిటీగా ఏర్పడి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, నిత్యావసరాల సరఫరా తీరు, మెనూ, వంటకాల నాణ్యతలను ప్రతిరోజూ పర్యవేక్షించాలని, కమిటీ పరిశీలించిన అంశాలను, లోటుపాట్లను, తనిఖీ వివరాలను ఎండీఎం మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయ విద్య, సంక్షేమ సహాయకులు వారంలో మూడుసార్లు సంబంధిత పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేయాలని, స్వయం సహాయక సంఘాలు త్రైమాస ఆకస్మిక తనిఖీ చేసి నివేదిక సమర్పించాలన్నారు. తనిఖీకి సంబంధించి ఎటువంటి ముందస్తు సమాచారం పాఠశాలలకు ఇవ్వరాదని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలును పర్యవేక్షించడానికి ఆర్డీవో స్థాయి కలిగిన ఒక ప్రత్యేకాధికారిని నియమించనున్నట్టు పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " నేటి నుంచి ‘మధ్యాహ్న భోజనం’ కొత్త మెనూ"

Post a Comment