చంద్రయాన్‌-3కి కేంద్రం ఆమోదం: ఇస్రో చీఫ్‌

2019లో ఇస్రో అనేక విజయాలు సాధించిందని గుర్తుచేసుకున్నారు. 2019లో గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఎంతో పురోగతి సాధించామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురిని ఎంపిక చేశామని తెలిపారు. వారికి రష్యాలో ఈ నెల మూడోవారం నుంచి శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. అలాగే గడిచిన ఏడాదిలో ప్రధానంగా ఇస్రో విస్తరణపై దృష్టిపెట్టామన్నారు. మరిన్ని మిషన్లు ఇస్రో సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నామన్నారు. ఈ క్రమంలో రెండో స్పేస్‌ పోర్ట్‌ నిమిత్తం తమిళనాడులోని తూత్తుకుడి ప్రాంతంలో భూసేకరణ చేశామని తెలిపారు.



చంద్రయాన్‌-2లో చోటుచేసుకున్న వైఫల్యంపైనా శివన్‌ వివరణ ఇచ్చారు. వేగాన్ని తగ్గించే వ్యవస్థ విఫలమవడం వల్లే ల్యాండర్‌ ఉపరితలాన్ని గట్టిగా ఢీకొట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా ల్యాండర్‌ జాడను కనుగొనడంలో సహాయపడిన చెన్నైకి చెందిన యువకుడు షణ్ముగ సుబ్రహ్మణియన్‌ను అభినందించారు.

చంద్రయాన్‌-3 ప్రాజెక్టును 2020లోనే చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ మంగళవారం వెల్లడించిన మరుసటి రోజే శివన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. 'చంద్రయాన్‌-2'ను విఫల ప్రాజెక్టుగా పరిగణించడం తగదని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమూ తొలి ప్రయత్నంలోనే జాబిల్లిపై ల్యాండర్‌ను దించలేకపోయిందని గుర్తుచేశారు. చంద్రయాన్‌-2తో సముపార్జించుకున్న అనుభవం, ఇప్పటికే అందుబాటులో ఉన్న పలు మౌలిక వసతులు నూతన ప్రాజెక్టులో కీలకంగా మారుతాయని.. చంద్రయాన్‌-2తో పోలిస్తే కొత్త ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "చంద్రయాన్‌-3కి కేంద్రం ఆమోదం: ఇస్రో చీఫ్‌"

Post a Comment