బోస్టన్ నివేదిక తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం
అమరావతి: మూడు రాజధానుల అంశంపై తుది నిర్ణయం దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 27న జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో
చర్చించనుంది. అనంతరం జనవరి మొదటివారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించే యోచనలో ఉంది. రాజధాని వ్యవహారంపై జీఎన్రావు కమిటీతోపాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)నకు కూడా ప్రభుత్వం అధ్యయన బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మధ్యంతర నివేదికను ఇచ్చింది. గ్రీన్ఫీల్డ్ కంటే బ్రౌన్ఫీల్డ్ రాజధానితోనే అభివృద్ధి సాధ్యమని అందులో పేర్కొంది. బీసీజీ నుంచి పూర్తి నివేదిక వచ్చాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. రాజధానిలోని ప్రాజెక్టుల్లో సాంకేతిక అంశాలపైనా బీసీజీ అధ్యయనం చేస్తోంది
0 Response to "బోస్టన్ నివేదిక తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం"
Post a Comment