అమెరికా దిగువసభలో భారత్కు మద్దతుగా..
వాషింగ్టన్: అధికరణ 370 రద్దు విషయంలో అమెరికా చట్టసభలో ప్రముఖ సభ్యుడు భారత్కు మద్దతుగా నిలిచారు. కశ్మీర్ ఆర్థిక అభివృద్ధి, అవినీతి నిర్మూలన, కుల-మత వివక్షను రూపుమాపడం కోసమే అధికరణను రద్దు చేశారని దిగువ సభకు జో విల్సన్ వివరించారు. అనేక పార్టీల మద్దతుతో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.
ఈ సంవత్సరం మొత్తం భారత్తో తాను నిరంతర సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. అలాగే భారత్తో సంబంధం ఉన్న ప్రతినిధులతోనూ చర్చలు జరిపానన్నారు. ఆగస్టులో ముంబయిలో పర్యటించి 26/11 ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులర్పించానని సభకు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపేలా ఉందని కొనియాడారు
ఈ సందర్భంగా సెప్టెంబరులో జరిగిన 'హౌడీ-మోదీ' సభ విశేషాలను కూడా విల్సన్ సభతో పంచుకున్నారు. రిపబ్లికన్ నేత అయిన విల్సన్ సౌత్ కారోలినా నుంచి 'హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్'లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు
0 Response to "అమెరికా దిగువసభలో భారత్కు మద్దతుగా.."
Post a Comment