'ఇంగ్లీష్' జీవోపై కేంద్రం ఆరా సవరణ చేసేయోచనలోరాష్టం
ఆ ఉర్జూమీడియంపై పునరాలోచన?
అత్వరలోనేన్యాయమూర్తి పరిశీలనకు
రానున్న'పిల్
గుంటూరు, ప్రభన్యూస్ బ్యూరో: రాష్త్ర ప్రభుత్వం
ఆంగ్ల మాధ్యమంపై ప్రవేశపెట్టిన ఉత్తర్వులపై
కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు ఆరాతీసినట్టు
సమాచారం. ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ
హైకోర్ట్లో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం స్రూటినీ
పూర్తయింది. ఆ పిటిషన్ ఈనెల జి త్ £4ీవ తేదీలలో
ర్తి పరిశీలనకు వచ్చే అవకాశం వుంది.
ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని సైతం
ప్రతివాదిగా చేర్చటంతో సంబంధత అధికారులు
న్యాయమూర్తి పరిశీలనకు వచ్చే ముందే పూర్తి వివరాలు
సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాహక్కు చట్టంలోని సెక్షన్
కు సవరణలు చేస్తూ రాప్రప్రభుత్వం 81, 15 జీవోలను
విడుదల చేసింది. ఆ జీవోలను నిలిపివేయాలని కోరుతూ
పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు. జీవో నంబర్ 81
ప్రకారం ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలన్ని
ఆంగ్లమాధ్యమంలోకి మారాల్సి వుంటుంది. జీవో 85
ప్రకారం రాష్ర్రంలోని అన్ని పాఠశాలల్లో ఆంగ్ల
మాధ్యమంలోనే బోధన చేయాల్సి వుంది. ఈ రెండు
రాజ్యంగ విరుద్ధమైనందున వాటిని కొట్టివేయాల్సిందిగా
కోరుతూ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలయింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్రశాసనసభలో
ఆమోదం పొందినప్పటికి శాసనమండలిలో
వీగిపోయాయి. దీంతో ఆ బిల్లు మరోసారి శాసనసభ
ముందుకు రావలసి వుంది. అయితే ప్రభుత్వం బిల్లును
శాసనసభలో ప్రవేశపెడుతుందా లేక ఆర్డినెన్స్ జారీ
చేస్తుందా అనే విషయం వేచి చూడాలి. ప్రభుత్వ ఉత్తర్వుల
కారణంగా భాషాపరంగా మైనారిటి ( లింగ్విస్తిక్ మైనారిటి)
లు వారి మాతృభాషలో విద్యాభ్యాసం చేసే హక్కును
కోల్పోతున్న విషయాన్ని ' ఆంధ్రప్రభ ' వెలుగులోకి
తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అదే అంశంపై రాష్ట్ర
ప్రభుత్వం సైతం సానుకులంగా పరిశీలన జరుపుతున్నట్లు
సమాచారం. ప్ర ఆబిల్లులో సవరణలు ప్రతిపాదించే
సమయంలో ఉర్ధూ మినహయించే అవకాశం
ఉన్నదని భావిస్తున్నారు.
విద్యాహక్కుకు వ్యతిరేకమా 7
కేంద్ర ప్రభుత్వం 2008లో ప్రవేశపెట్టిన “ రైట్ ఆఫ్
చిలైన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ” కు
వ్యతిరేకంగా వుందని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు
చేసిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ తరుపున వాదిస్తున్న
హైకోర్ట్ న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు
రు. 2009 విద్యాహక్కు చట్టంలో సెక్షన్ 29
(ఎఫ్) ప్రకారం బోధన మాత, ఉండాలనిస
చేసినట్టు తెలిపారు. అయితే ఆ సెక్షన్లో పేర్కొన్న
ప్రాక్టీసబుల్” అనే పదం ఇక్కడ వర్తించదని ఆయన
చెప్పారు. రాష్ట్రప్రభుత్వ సిలబస్ను రూపొందించే స్పేట్
కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎస్ సిఈఆర్టి ) కు
మార్గదర్శనం చేసే విధంగా ఆ జీవో వుందని ఆయన
తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ జీవో కేంద్ర చట్టాన్ని
ఉల్లంఘించేదిగా వుందని ఆయన తెలిపారు. వీటన్నింటిని
న్యాయమూర్తి దృష్పికి తీసుకెళ్లనున్నట్టు ఇంద్రనీల్ '
ప్రభన్యూస్ బ్యూరో 'కు వివరించారు
0 Response to "ఇంగ్లీష్' జీవోపై కేంద్రం ఆరా"
Post a Comment