విద్యార్ధి హక్కును హరించడమే.. ౫ ఆంగ్ల మాధ్యమం జీవోలు రద్దుచేయండి... హైకోర్టులో మరో పిల్‌

విద్యార్ధి హక్కును హరించడమే..

౫ ఆంగ్ల మాధ్యమం జీవోలు రద్దుచేయండి... హైకోర్టులో మరో పిల్‌
అమరావతి, డిసెంబరు 1/(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠ
శాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరే
కిస్తూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అసిస్టెంట్‌
ప్రొఫెనర్‌ గుంటుపల్లి శ్రీనివాస్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. విద్వార్ధి
తనకు నచ్చిన మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే ప్రాథమిక హక్కును
రాజ్యాంగం - ప్రసాదించినప్పటికీ. బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని
రుద్దడం సరికాదని, చిన్నారుల ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని
విద్యాహక్కు చట్టం చెబుతోందని పిటిషనర్‌ గుర్తు చేశారు. ప్రభుత్వ ప్రయ

త్నంతో తెలుగు భాషకున్న గొప్ప సంస్కృతి నిర్వీర్యమైపోతుందన్నారు. ఈ నిర్ణయం ఏమాత్రం సరికాదని, కాబట్టి దీనికి సంబంధించి జారీచేసిన 81, 85 జీవోలను రద్దు చేని, విద్యార్దులు తమకు ఇష్టమైన మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కును కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. పిటిషన్‌లో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్యా కమిషనర్‌, సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌,ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ టైనింగ్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌, కేంద ప్రభుత్వ మానవవనరుల అభివృద్ది శాఖ కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

1 Response to "విద్యార్ధి హక్కును హరించడమే.. ౫ ఆంగ్ల మాధ్యమం జీవోలు రద్దుచేయండి... హైకోర్టులో మరో పిల్‌"

  1. పేద పిల్లల పట్ల ఈ ప్రభుత్వం కి చాలా ప్రేమ ఉన్నట్లు, అందువల్లనే English Medium పెడుతున్నట్లు భావించేవారు పునరాలోచన చేయాలి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవస్థ బలోపేతం చేయడానికి చర్యలు ఏమీ లేవు. ప్రభుత్వం కి నిజంగా ప్రేమ ఉంటే ప్రతి చోట English Medium మరియు Telugu Medium రెండింటినీ ఉంచాలి. Private పాఠశాల వ్యవస్థ మాదిరి ఆర్థిక , భౌతిక వసతులు కల్పించాలి. Teachers ను కేవలం బోధనకు మాత్రమే ఉపయోగించాలి. Single Teacher school , Upgraded High school s పరిస్థితి దయనీయం.

    ReplyDelete