:
అమరావతి: మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ ముగిసింది. వివిధ అంశాలపై 2 గంటలకు పైగా కేబినెట్ చర్చించింది. సచివాలయంలో సీఎం జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. రాజధానితో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సిఫార్సులు చేసిన జీఎన్రావు కమిటీ నివేదికపై కేబినెట్ సమగ్రంగా చర్చించినట్లు సమాచారం. జీఎన్రావు కమిటీ నివేదికను యథాతథంగా ఆమోదిస్తారా? లేదా మార్పులేమైనా ఉంటాయా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
అమరావతి అభివృద్ధి, తిరిగిచ్చే ప్లాట్లపైనా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
కేబినెట్ నిర్ణయాలను మరికాసేపట్లో మంత్రి పేర్ని నాని వెల్లడించనున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళన, సీఆర్డీఏ వ్యవహారాలు కేబినెట్లో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.రాజధాని అంశంపై ఆర్థిక మంత్రి బుగ్గన నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదిక అందజేసింది.
మరోవైపు విశ్రాంత జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రివర్గంలో చర్చించినట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. బీసీజీ వివేదిక ఇంకా రావాల్సి ఉందని, ఆ తర్వాత ఏం చేయాలన్నదానిపై ఆలోచిస్తామని చెప్పారు. మీడియా సమావేశంలో మంత్రి పేర్ని నాని మిగతా వివరాలు వెల్లడిస్తారని
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండు గంటలపాటు కేబినెట్ సమావేశం
కొనసాగింది. జీఎన్ రావు కమిటీ నివేదికపై కేబినెట్లో చర్చించారు. సమావేశం
అనంతరం సచివాలయం బయట మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. రాజధానిపై
బీసీజీ రిపోర్ట్
రావాల్సి ఉందన్నారు. రిపోర్ట్ వచ్చాక ఏం చేయాలన్న అంశంపై ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాగా.. రాజధానిపై
వచ్చే నెల 3న బీసీజీ నివేదిక ఉంటుందని సమాచారం. నివేదికపై నిశితంగా
అధ్యయనం చేసిన తర్వాతే రాజధానిపై ఫైనల్గా ప్రభుత్వం నిర్ణయం
ప్రకటిస్తుందని తెలుస్తోంది. జీఎన్ రావు, బీసీజీ నివేదికలు పరిశీలించిన
అనంతరమే ప్రకటన ఉంటుందని సమాచారం. అయితే.. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి
మూడు రాజధానులపై ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం
కొద్దిసేపటి క్రితం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం
కొనసాగింది. అభివృద్ధి వికేంద్రీకరణపై జీఎన్ రావు కమిటీ అందజేసిన
నివేదికలోని సూచలనపై కేబినెట్ సమావేశంలో సూత్రపాయంగా చర్చ జరిగింది. ఇదే
విషయాన్ని మంత్రి కురసాల కన్నబాబు కూడా ధ్రువీకరించారు. అయితే, రాజధాని
విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక రావాల్సి ఉందని గుర్తుచేశారు. బోస్టన్
కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక గురించి అధికారులు ప్రభుత్వం
దృష్టికి తీసుకొచ్చారని.. జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు
రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం
తీసుకుంటామని చెప్పారు
0 Response to "ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం"
Post a Comment