ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు
సమ్మెకాలానికి వేతనం.. విరమణ వయసు పెంపు
కార్మికులకు 52 రోజుల సమ్మెకాలానికి వేతనం ఇస్తామని సీఎం ప్రకటించారు. సమ్మె కాలానికి సంబంధించిన వేతనాన్ని ఏకమొత్తంలో ఒకేసారి ఇవ్వనున్నట్లు చెప్పారు. దీంతో పాటు సెప్టెంబర్ వేతనం సోమవారమే చెల్లించనున్నట్లు సీఎం తెలిపారు. మరోవైపు కార్మికుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పొడిగించనున్నట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 97 డిపోల నుంచి డిపోకు ఐదుగురు చొప్పున కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వారితో కలిసి మద్యాహ్న భోజనం చేసిన కేసీఆర్.. తర్వాత రెండు గంటలపాటు వారితో సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన ప్రతి అంశంపైనా సీఎం స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని సీఎం కార్యాలయం పేర్కొంది. ఈ భేటీలో మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలు, కంట్రోలర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు
0 Response to "ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ వరాలు"
Post a Comment