త్వరలో డేటా, కాల్స్ ఛార్జీలు పెంచనున్న జియో
దిల్లీ: ఎయిర్టెల్, ఐడియా వొడాఫోన్లు త్వరలో ఛార్జీలు పెంచనున్నట్లు వెల్లడించిన ఒక రోజు వ్యవధిలో రిలయన్స్ జియో సైతం సంచలన నిర్ణయం తీసుకుంది. రాబోయే కొద్ది రోజుల్లో తాము కూడా మొబైల్ కాల్స్, డేటా ఛార్జీలు పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. టెలికాం ఛార్జీల సవరణ కోసం భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. 'ఇతర ఆపరేటర్ల మాదిరిగానే మేము కూడా
ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం. భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తూ.. టెలికాం పరిశ్రమను బలోపేతం చేసేలా కృషి చేస్తాం. డేటా వినియోగం, డిజిటలీకరణపై ప్రతికూల ప్రభావం పడకుండా రాబోయే కొద్ది వారాల్లో ఛార్జీలు పెంపు ప్రక్రియ చేపడతాం' అని ప్రకటనలో పేర్కొంది
0 Response to "త్వరలో డేటా, కాల్స్ ఛార్జీలు పెంచనున్న జియో"
Post a Comment