జెరూసలేం యాత్రికుల ఆర్థికసాయం పెంపు
అమరావతి: జెరూసలేం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ఆర్థికసాయం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వార్షికాదాయం రూ.3లక్షల్లోపు ఉన్న వారికి రూ.20 వేలు, రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి రూ.10 వేలు పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రూ.3లక్షల్లోపు ఆదాయం ఉన్న క్రైస్తవ యాత్రికులకు ఇచ్చే మొత్తాన్ని రూ.40 వేల నుంచి 60 వేలకు.. రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి రూ.20 వేల నుంచి 30 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది
0 Response to "జెరూసలేం యాత్రికుల ఆర్థికసాయం పెంపు"
Post a Comment