కదం తొక్కిన ఉద్యోగులు

*కదం తొక్కిన ఉద్యోగులు*

*30-11-2019 03:04:51*

*రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు*

*పట్టించుకోకుంటే రాజ్యాంగ బద్దంగా ఉద్యమిస్తామని హెచ్చరిక*




ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఏపీజేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపిన ఉద్యోగులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పాత తాలూకా కేంద్రాల వద్ద ధర్నాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా సెంటర్ లో జరిగిన నిరసనల్లో ధర్నా శిబిరం ను ఎపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి యస్వీ నాగేశ్వరరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా కొత్త ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సాచివేత ధోరణిని అవలంబిస్తోందని అన్నారు. పీఆర్సీ అమలు, కరువు భత్యం మంజూరు, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రధాన సమస్యలపై దృష్టి సారించలేదన్నారు. ఆరునెలలకు ఒకసారి చెల్లించాల్సిన కరువు భత్యం ఇప్పటికి మూడు దఫాలుగా చెల్లించాల్సి ఉందని, దీనిపై ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వారంరోజుల్లో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కమిటీల పేరుతో సీఎం జగన్‌ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే డిసెంబరు 10న అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నా, 20న విజయవాడలో రాష్ట్రవ్యాప్త ధర్నా నిర్వహించి ఆందోళనను ఉధృతం చేస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు.
ఈ ధర్నలో యన్.జి.ఓ నేత కె.పి.రావు,ఎపిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ భాస్కర వర్మ,వరలక్ష్మి, వై.శ్రీనివాస్, కలిదిండి నాయకులు కె.యన్.శ్రీనివాస్, మధు,పార్వతీశ్వర్,బి.జె.ప్రభాకరరావు,విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కదం తొక్కిన ఉద్యోగులు"

Post a Comment