'అమ్మఒడి'కి ఆరు అంచెలు



  • 30లోగా వడపోత పూర్తి
  • నిజమైన లబ్ధిదారులకే చాన్స్‌
  • మార్పు, చేర్పులకు హెచ్‌ఎంలకు స్వేచ్ఛ
  • ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే
  • అధికారులకు పాఠశాల విద్యాశాఖ నిర్దేశం

అమరావతి, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభించనున్న 'జగనన్న అమ్మఒడి' పథకానికి సంబంధించిన లబ్ధిదారులను మొత్తం ఆరు అంచెల్లో ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 30లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది

అర్హులైన తల్లులు/సంరక్షకుల జాబితాలను సిద్ధం చేసేందుకు వీలుగా జిల్లా, మండల, పాఠశాల, గ్రామస్థాయిల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. మొత్తం 6 అంచెల్లో లబ్ధిదారులను పరిశీలించి, ఎలాంటి విమర్శలకూ తావులేకుండా ఎంపిక చేయాలని విద్యాశాఖ సూచించింది.

  • ఈ నెల 17 నుంచి 21 మధ్యకాలంలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను చైల్డ్‌ ఇన్ఫోలో నమోదు చేసి, 21న ఏపీసీఎ్‌ఫఎ్‌సఎ్‌సకి అందజేశారు.
  • ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ పరిశీలించి, రేషన్‌ కార్డుల జాబితా, ప్రజా సాధికార సర్వే సమాచారంతో సరిపోల్చి తెల్లరేషన్‌ కార్డులో ఉన్న తల్లుల/సంరక్షకుల వివరాలను సేకరించి, విద్యార్థుల వారీగా 23 నాటికి అనుసంధానం చేయాలి. అనంతరం దీనిని హెచ్‌ఎంలకు పంపాలి.
  • ప్రధానోపాధ్యాయులు ఆవివరాలను సరిపోల్చుకోవడం, నమోదు చేయడం, విద్యార్థుల, తల్లి/సంరక్షకుల పేరు, ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా వివరాలను 24లోపు సేకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.
  • ఏపీసీఎ్‌ఫఎ్‌సఎస్‌ ద్వారా అందిన వివరాల్లో లోపాలుంటే వాటిని సరిదిద్దాలి. ఆ తర్వాత విద్యార్థుల స్వగ్రామాలు, మండలాల వారీగా తల్లులు/సంరక్షకుల జాబితాను మండల విద్యాఽఽధికారి(ఎంఈవో)కి పంపాలి.
  • 100 మందిలోపు విద్యార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని ఈ నెల 25లోగా, 101 నుంచి 300 మందిలోపు విద్యార్థులున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈ సమాచారాన్ని 26లోగా, 300లకు పైగా విద్యార్థులుంటే ఈ సమాచారాన్ని 27లోగా ఆన్‌లైన్‌లో ఎంఈవోకు పంపాలి.
  • ఎంఈవోలు తమకు చేరిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు గ్రామాలు/వార్డుల వారీగా జాబితాలను ముద్రించి గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకునికి లేదా క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌కు అందజేయాలి.
  • గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకుడు/క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ ఎంఈవో ద్వారా అందిన జాబితాలను సంబంధిత గ్రామ/వార్డు వలంటీర్లకు ఇవ్వాలి. వారి ద్వారా సమాచారాన్ని ఆయా కుటుంబాలకు వివరించి.. లేని వివరాలు అంటే.. తల్లి పేరు, తెల్లరేషన్‌ కార్డు వివరాలు, ఆధార్‌ నెంబరు, బ్యాంక్‌ ఖాతా నెంబరు, ఐఎ్‌ఫఎ్‌ససీ కోడ్‌ తదితర వివరాలను సేకరించాలి. ఆ సమాచారంలో తెల్లరేషన్‌ కార్డు లేనివారి విషయంలో వారు నిరుపేద/అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో కాదో 6 అంచెల పరిశీలన ద్వారా నిర్ధారించాలి. ఈ కార్యక్రమం 30లోగా పూర్తి చేయాలి. గ్రామ/వార్డు వలంటీర్లు క్షేత్రస్థాయిలో నమోదు చేసిన/నిర్ధారించిన సమాచారాన్ని విద్యా, సంక్షేమ సహాయకుడు/క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌ల ద్వారా తిరిగి ఎంఈవోకి పంపాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "'అమ్మఒడి'కి ఆరు అంచెలు"

Post a Comment