టోల్గేట్ల దగ్గర బారులు తీరే పనిలేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని టోల్గేట్ల
వద్ద డిసెంబర్ 1 నుంచి ‘ఫాస్టాగ్’ అమలు చేయనున్నామని జాతీయ రహదారుల
సంస్థ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణలోని 17
టోల్ప్లాజాల్లోనూ ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆయన
మాట్లాడుతూ.. ‘వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్ను అమర్చుతాం. ఈ టాగ్ను
బ్యాంక్ అకౌంట్కు అనుసంధానం చేస్తాం. మొబైల్ వాలెట్ లేదా ప్రత్యేక
కౌంటర్లలో ఫాస్టాగ్ను రీచార్జ్ చేసుకోవచ్చు
దీనిద్వారా టోల్ప్లాజా దగ్గర బారులు తీరకుండా సులువుగా వెళ్లిపోవచ్చు.
ట్రక్కులకు కూడా అనుసంధానం చేయడం వల్ల అది ఏ టోల్ప్లాజా దాటింది అనే విషయం
ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టోల్ ప్లాజాల దగ్గర నియమించిన ప్రత్యేక
సిబ్బంది ద్వారా వాహనదారులకు ఈ విధానం గురించి అవగాహన కల్పిస్తున్నాం.
వాహనదారుడు ఫాస్టాగ్ యాప్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు’ అని ఆయన
తెలిపారు
0 Response to " టోల్గేట్ల దగ్గర బారులు తీరే పనిలేదు"
Post a Comment