7 ప్రశ్నల తొలగింపు.. 10 ప్రశ్నల ఆప్షన్ల మార్పు

  • గ్రూప్‌-2 మెయిన్స్‌ రివైజ్డ్‌ కీ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-2 మెయిన్స్‌(ఆన్‌లైన్‌) పరీక్షలకు సంబంధించిన ‘రివైజ్డ్‌ కీ’ని ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. 



‘ప్రాథమిక కీ’లో ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు, ఆప్షన్లపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ... మొత్తం మీద 17 మార్పులను సిఫారసు చేసింది. ప్రశ్నపత్రాల్లోని 7 ప్రశ్నలను 

తొలగిచడంతో పాటు, 10 ప్రశ్నలకు సంబంధించిన ఆప్షన్లలో మార్పులను సిఫారసు చేసింది. వీటిపై అభ్యంతరాలను అభ్యర్థులు ఈ నెల 26లోగా పంపించాలని ఏపీపీఎస్సీ కోరింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " 7 ప్రశ్నల తొలగింపు.. 10 ప్రశ్నల ఆప్షన్ల మార్పు"

Post a Comment