డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానం

టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చిప్ లు అందుబాటులో వుంచామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) పీడీ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. టోల్ గేట్ల వద్ద ఛార్జీలు చెల్లింపులకు ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఫాస్టాగ్ విధానం డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి కానుంది. ఈ నేపథ్యంలో విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, 23 బ్యాంకుల ద్వారా ఫాస్టాగ్ చిప్ లు 



అందిస్తున్నామని, కొన్ని సమయాల్లో చిప్ లు లేకుంటే వెంటనే తెప్పించి ఇస్తున్నామని చెప్పారు. ఎల్లుండి నుంచి టోల్ గేట్ల వద్ద నగదు లావాదేవీలకు ఒక లైనే వుంటుందని అన్నారు. ఫాస్టాగ్ లో సాంకేతిక సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని, లారీలు, కార్ల యజమానుల సంఘాలు కొన్నాళ్లు వాయిదా వేయమన్నాయని, సంఘాల వినతులను ఉన్నతాధికారులకు పంపినట్టు చెప్పారు

ఫాస్టాగ్ పై అవగాహన కల్పించే నిమిత్తం టోల్ గేట్ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

  • ఫాస్టాగ్‌ గడువు పెంపున్యూఢిల్లీ : ఫాస్టాగ్‌ విధానం గడువును మరో 15 రోజులపాటు పొడిగించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అన్ని టోల్‌ప్లాజాల … ...
  • డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానంటోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ చిప్ లు అందుబాటులో వుంచామని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (నాయ్) పీడీ విద్యాసాగర్ రావు స్పష్టం చేశారు. టోల్ గేట్… ...

0 Response to "డిసెంబర్ 1 నుంచి ఫాస్టాగ్ విధానం"

Post a Comment