ఇక ఏటా డీఎస్సీ!
విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
‘వెలిగొండ’కు ప్రాజెక్టుల్లో రెండో ప్రాధాన్యత
త్వరలో మన బడి–మన బాధ్యత కార్యక్రమం
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడి
సంస్కరణలకు పెద్దపీట..
గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజాధనాన్ని లూటీ చేయటంతో విద్యాశాఖలో రివర్స్ టెండరింగ్ విధానం అమలు చేస్తున్నట్లు మంత్రి సురేష్ చెప్పారు. వర్చువల్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, వీటి కోసం రివర్స్ టెండరింగ్కు వెళ్తామన్నారు. పారదర్శకంగా పరిపాలన ఉంటుందన్నారు. బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారిపోయి అత్యున్నత స్థాయికి వెళ్తాయన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టత కోసం ప్రైవేటు విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, జస్టిస్ కాంతా రావు, జస్టిస్ ఈశ్వరయ్యలతో కమిషన్లను ఏర్పాటు చేశారని, సంస్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా విద్యాదినోత్సవం నాడు ప్రతిభా వంతులైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పురస్కారాలు అందిస్తామన్నారు.
2వ ప్రాధాన్యత ప్రాజెక్టుగా వెలిగొండ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలవరం ప్రాజెక్టు తరువాత వెలిగొండ ప్రాజెక్టును 2వ ప్రాధాన్యతగా గుర్తించినట్లు తెలిపారని, వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు కచ్చితంగా వస్తాయని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ నేతల మాదిరిగా 5 ఏళ్ల పాటు మాయమాటలు చెప్పి తప్పించుకోమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.1500 కోట్లతో కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపారని తెలిపారు. ఇందులో నష్ట పరిహారానికి, పునరావాస కాలనీలకు మొదటి విడతగా రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 3 జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు వస్తుందని, మొదటి దశలో సుమారు 1.16 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని మంత్రి తెలిపారు. 2వ టన్నెల్ పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు
0 Response to "ఇక ఏటా డీఎస్సీ!"
Post a Comment