ప్రపంచంలో 5వ దేశంగా భారత్కు గుర్తింపు.
అనేక అవాంతరాలను దాటుకుంటూ 2019 సంవత్సరం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షిప్యార్డులోనే ట్రయల్ రన్స్ జరుగుతున్నట్లు సమాచారం. 11184గా పిలవబడే రాడార్ సర్వేలెన్స్ భారీ షిప్ ప్రపంచంలోని అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ దేశాలకే ఇప్పటివరకూ ఉంది. ఆయా దేశాల సముద్ర జలాల్లో శత్రునౌకల, క్షిపణుల రాకపోకల సమాచారాన్ని రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా గుర్తించగల సత్తా ఈ నౌకకు ఉంది. ఈ నౌక నిర్మాణంలో షిప్యార్డు ఏళ్ల తరబడి నిమగమైంది. గతంలో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో ఇది మొదలై నేడు రూ.1,500 కోట్ల అంచనాలకు చేరింది. ఈ నౌక సముద్ర అంతర్భాగంలోనూ, ఉపరితలంపైనా ప్రయాణం చేయగల సత్తాతో రూపుదిద్దుకుంది. త్వరలోనే దీన్ని భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టేందుకు షిప్యార్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కోసం అదానీతో కలిసి పని చేయడంగానీ, పోటీ ఇవ్వడంగానీ షిప్యార్డు చేయనున్నట్లు సమాచారం. రక్షణ రంగ ప్రయోజనాలు, షిప్యార్డు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్రం హెచ్ఎస్ఎల్కే దీన్ని ఇచ్చినా చేయగల సత్తా నౌకానిర్మాణ కేంద్రానికి ఉందని ఉన్నతాధికారులు గట్టిగా చెబుతున్నారు. గడచిన నాలుగేళ్లలో 15 నౌకలను భారత నావికాదళానికి హిందుస్థాన్ షిప్యార్డు అందజేసింది. అదే సమయంలో 37 నౌకలను రిపేరు చేసి 15 నౌకలను అందజేసింది. అత్యంత భారీ ప్రాజెక్టు అయిన పి 75 ఇండియా ఆరు సబ్మెరైన్ల కాంట్రాక్టు దాదాపు రూ.45 వేల కోట్ల విలువైనది. నామినేషన్ పద్ధతిలో హిందుస్థాన్ షిప్యార్డుకే దక్కాల్సి ఉన్నా, తాజాగా అదానీ కంపెనీ పోటీ పడుతున్నట్టు
0 Response to "ప్రపంచంలో 5వ దేశంగా భారత్కు గుర్తింపు."
Post a Comment