త్వరలో అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు

*త్వరలో అన్ని యాజమాన్యాల  ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు మంజూరు* :
                                ఇ.హెచ్‌.ఎస్‌ సబ్‌ కమిటి ఛైర్మన్‌ సత్యనారాయణ
👍 శుక్రవారం జరిగిన ఉద్యోగుల  హెల్త్‌ కార్డ్సు సబ్‌ కమిటీ సమావేశంలో ‘సబ్‌ కమిటీ ఉద్యోగ సంఘ నాయకులు  డిమాండ్‌ మేరకు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు  సంస్థ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌ కార్డులు  జారీ చేస్తున్నట్లు ఛైర్మన్‌ మరియు ఆర్థిక శాఖ, ముఖ్య కార్యదర్శి కె.వి.వి.సత్యనారాయణ తీర్మానించారు. 
ఈ రోజు ఇహెచ్‌ఎస్‌ సబ్‌ కమిటి ఛైర్మన్‌ కె.వి.వి.సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇహెచ్‌ఎస్‌ ‘సబ్‌ కమిటీ సభ్యులు  సుదీర్ఘంగా చర్చించిన సబ్‌ కమిటి సమావేశం పలు  తీర్మానాలు  చేసింది. 
👉 ఎయిడెడ్, ఎ.పి.వి.వి. పరిషత్‌, మోడల్‌ స్కూల్‌ టీచర్లు, గురుకులాలు, గ్రంథాలయ ఉద్యోగులు , యూనివర్సిటీ స్టాఫ్ తదితర 22,516 మందికి కొత్తగా హెల్త్‌ కార్డులు జనవరి లోపు జారీ 
👉 ప్రభుత్వం పూర్తి స్థాయిలో, నాణ్యమైన వైద్యం అందించుటకు ఇప్పుడున్న ప్రీమియం రూ.90/- నుండి 225/-లు, రూ.120/- నుండి 300/- రూ॥లు గా పెంచడం జరిగింది.
👉 మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ ప్రభుత్వం ఉచితంగా భరించాలని లేని పక్షంలో అవసరం లేదన్నారు.



👉 వైద్యం చేసిన ఆసుపత్రులకు వైద్యం అందించాక వెంటనే బడ్జెట్‌ను విడుదల చేయుటకు గ్రీన్‌ ఛానెల్‌ విధానంలో ట్రస్టుకు కేటాయిస్తారు.
👉 పెండింగులో వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులను ఒక నెలలోపు మంజూరు చేస్తామని తెలిపినారు.
👉 ఎ.టి.ఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో జనవరి నుండి ఆరోగ్య కార్డుల  జారీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "త్వరలో అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు"

Post a Comment