పెరుగు, పీచు పదార్థాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు చెక్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 28: పీచుతో కూడిన ఆహార పదార్థాలు, పెరుగును ఎక్కువగా తినేవారికి ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పు అతి తక్కువని అమెరికాలోని వేండర్‌బిల్ట్‌ -ఇన్‌గ్రామ్‌ కేన్సర్‌ కేంద్రం శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారు అధ్యయనంలో భాగంగా వివిధ దేశాలకు చెందిన 14 లక్షల మందిని ఐదు గ్రూపులుగా విభజించారు. వారు తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు, పెరుగు మోతాదు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేశారు. వాటి వాడకం అధికంగా ఉన్నవారిలో ఊపిరితిత్తుల కేన్సర్‌ ముప్పు 33 శాతం తగ్గడాన్ని గుర్తించారు. పెరుగు, పీచుపదార్థాల్లోని పోషక విలువలు జీర్ణాశయంలోని పేగుల్లో ఉండే గట్‌ బ్యాక్టీరియా సామర్థ్యాన్ని పెంచి.. గుండెజబ్బులు, కేన్సర్‌లు దరి చేరకుండా అడ్డుకుంటాయన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " పెరుగు, పీచు పదార్థాలతో ఊపిరితిత్తుల కేన్సర్‌కు చెక్‌"

Post a Comment