ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండిప్రజలకు నిపుణుల కమిటీ సూచన
ప్రజలకు నిపుణుల కమిటీ సూచన
అమరావతి: ఏపీ రాజధాని, ఇతర ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ఆ సూచనలను ఈమెయిల్, లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. నవంబర్ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం
తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు
*✨ ఏపీ రాజధాని*
★ ఏపీ రాజధాని, నిర్మాణం పై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది.
★ ఆ సూచనలను ఈమెయిల్, లేఖల ద్వారా పంపాలని జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సూచన.
★ *నవంబర్ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది.*
★ రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
★ మీయొక్క సూచనలు, అభిప్రాయాలను తెలియజేయుటకు...
👇🏻👇🏻👇🏻
Expertcommitee2019@gmail.com
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమలు జరుగుతున్న వివిధ ప్రణాళికలు, వాటి అమలు తీరును అధ్యయనం చేసి రాజధానితో సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి వ్యూహం కోసం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ ప్రజల నుండి వినతులను స్వీకరించనుంది. ప్రజలు తమ వినతులు, సలహాలు, సూచనలు విజ్ఞాపనలను మెయిల్ ద్వారా, పోస్టు ద్వారా నవంబరు 12వ తేదీలోపు పంపాలని సూచించింది.
మెయిల్స్ను expertcommittee2019@gmail.com,
డోర్ నెంబరు 56-15-53, వినాయక టెంపుల్రోడ్, పడమట, విజయవాడ- 520010కు పంపాలని సూచించింది. ఈ మేరకు నిపుణుల కమిటీ కన్వీనర్ జిఎన్రావు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు
🌿🌼🌸🌸🌼🌿
0 Response to "ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండిప్రజలకు నిపుణుల కమిటీ సూచన"
Post a Comment