నిజాం ఆస్తుల కేసు : భారత్కు భారీ విజయం
లండన్ : అంతర్జాతీయ వేదికపై భారత్కు మరో భారీ విజయం చేకూరింది. 35 మిలియన్ బ్రిటిష్ పౌండ్ల (రూ 300 కోట్ల) విలువైన హైదరాబాద్ నిజాం ఆస్తులకు సంబంధించిన హక్కులపై భారత్ వాదనను బ్రిటన్ హైకోర్టు బుధవారం సమర్ధించింది. 70 ఏళ్ల కిందటి ఈ కేసులో పాకిస్తాన్కు ఎలాంటి
సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టు తీర్పుతో లండన్లోని నేషనల్ వెస్ట్మినిస్టర్ బ్యాంక్లో ఉన్న నిజాం నిధులపై తమకు హక్కుందని పాకిస్తాన్ పదేపదే చేస్తున్న వాదన పసలేనిదని తేలింది. దేశ విభజన సమయంలో అప్పటి హైదరాబాద్ నిజాం తనపై సైన్యం దండెత్తవచ్చనే భయంతో బ్రిటన్లో పాక్ హైకమిషనర్కు ఈ నిధులు పంపారు. ఈ నిధులు 1948 సెప్టెంబర్ నుంచి బ్రిటన్కు పాకిస్తాన్ హైకమిషనర్ ఖాతాలో ఉన్నాయి. వీటిపై తమకే హక్కులు ఉంటాయని పాకిస్తాన్ వాదిస్తుండగా, నిజాం వారసులు భారత్ ప్రభుత్వంతో కలిసి తమ వాదనలు వినిపించారు. ఈ నిధులు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాక్ వినిపించిన వాదనలను బ్రిటన్ హైకోర్టు తోసిపుచ్చింది. భారత్కు ఈ నిధులు చెందుతాయని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ఈ నిధి లబ్ధిదారునిగా ఏడవ నిజాంను గుర్తిస్తూ ఆయన ఇద్దరు మునిమనవలకు ఇది వారసత్వంగా సంక్రమిస్తుందని తెలిపింది. నిజాం ఆస్తులపై బ్రిటన్ హైకోర్టు తాజాగా వెలువరించిన తీర్పు అంతర్జాతీయ వేదికపై పాక్కు మరో చేదు అనుభవంగా మిగిలింది
Additional information
మరోసారి అవమానానికి గురైన పాకిస్థాన్
లండన్: హైదరాబాద్ నిజాంకు సంబంధించిన ఏడు దశాబ్దాల నాటి ఓ కేసులో భారత్కు ఊరట లభించింది. డెబ్భై ఏళ్ల క్రితం నిజాం బ్రిటన్కు తరలించిన ఒక మిలియన్ పౌండ్ల సొమ్ము (ఇప్పటి విలువ ప్రకారం 35 మిలియన్ పౌండ్లు) భారత్కే దక్కుతుందని హైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ సంపదపై పాకిస్థాన్కు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పింది. నిజాం సంపదపై తమకే అధికారం ఉందని 70 ఏళ్లుగా పాకిస్థాన్ వాదిస్తోందని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తు చేశారు. యూకే కోర్టు తాజా తీర్పుతో పాకిస్థాన్ అంతర్జాతీయ సమాజం దృష్టిలో మరోసారి అవమానానికి గురయినట్లయింది
1948లో ఏడో నిజాం పేరుపై లండన్లోని బ్యాంకులో ఒక మిలియన్ పౌండ్ల సొమ్ము జమ అయింది. ఈ చరిత్రాత్మకమైన కేసు 70 ఏళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తోంది. ఓ వైపు భారత్తో పాటు నిజాం వారసులైన ముఖర్రమ్ ఝా, ముప్ఫఖమ్ ఝా ఈ సంపదపై పోరాడుతుండగా.. మరోవైపు పాకిస్థాన్ ఆ ఆస్తి తమకే చెందుతుందని వాదించింది.
హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవక ముందు నిజాంకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేశామని, అందుకు చెల్లింపుగా ఈ సొమ్ము తమకే చెందుతుందని పాకిస్థాన్ అంటూ వస్తోంది. అయితే 1948లో ఏడో నిజాం 1 మిలియన్ పౌండ్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు యూకేలోని అప్పటి పాకిస్థాన్ రాయబారి హబీబ్ ఇబ్రహీమ్ రహీంతుల్లాకు పంపారు. ఆ సొమ్మును తనపై ఉన్న విశ్వాసంతో మాత్రమే నిజాం పంపారని రహీంతుల్లా ఓ సందర్భంలో అంగీకరించారు. మరోవైపు హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిగిన సమయంలో భయపడిన నిజాం తాను ఆ సొమ్మును పంపలేదని, తన పేరుపై మరెవరో పంపారని అన్నట్లు చెబుతారు.
ప్రస్తుతం ఆ సొమ్ము లండన్లోని వెస్ట్మినిస్టర్ బ్యాంకులో ఉంది. దాని విలువ ఇప్పుడు 35 మిలియన్ పౌండ్లు ( సుమారు రూ.306 కోట్లు). ఈ కేసులో నిజాం వారసులకు భారత ప్రభుత్వం చేయూతనివ్వడంతో కేసు నెగ్గగలిగారు
హైదరాబాద్ సంస్థానం భారత్లో కలవక ముందు నిజాంకు పెద్ద ఎత్తున ఆయుధాలు సరఫరా చేశామని, అందుకు చెల్లింపుగా ఈ సొమ్ము తమకే చెందుతుందని పాకిస్థాన్ అంటూ వస్తోంది. అయితే 1948లో ఏడో నిజాం 1 మిలియన్ పౌండ్ల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు యూకేలోని అప్పటి పాకిస్థాన్ రాయబారి హబీబ్ ఇబ్రహీమ్ రహీంతుల్లాకు పంపారు. ఆ సొమ్మును తనపై ఉన్న విశ్వాసంతో మాత్రమే నిజాం పంపారని రహీంతుల్లా ఓ సందర్భంలో అంగీకరించారు. మరోవైపు హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య జరిగిన సమయంలో భయపడిన నిజాం తాను ఆ సొమ్మును పంపలేదని, తన పేరుపై మరెవరో పంపారని అన్నట్లు చెబుతారు.
ప్రస్తుతం ఆ సొమ్ము లండన్లోని వెస్ట్మినిస్టర్ బ్యాంకులో ఉంది. దాని విలువ ఇప్పుడు 35 మిలియన్ పౌండ్లు ( సుమారు రూ.306 కోట్లు). ఈ కేసులో నిజాం వారసులకు భారత ప్రభుత్వం చేయూతనివ్వడంతో కేసు నెగ్గగలిగారు
0 Response to "నిజాం ఆస్తుల కేసు : భారత్కు భారీ విజయం"
Post a Comment