తల్లికి మాటిచ్చిన గాంధీ.. జీవితంలో ఆ మూడు ముట్టలేదు!

ఆయనో మహాత్ముడు. తల్లి మాటను తప్పలేదు. స్వరాజ్య స్థాపనలో విశేష కృషి చేశారు. ప్రపంచ అహింసా వాదాన్ని గట్టిగా వినిపించి బ్రిటీష్ పాలకులను గజగజ వణికించాడు. బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా నిలిచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకున్న బాపూజీ.. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహానుభావుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. చివరికి జాతిపితగా దేశ ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. అక్టోబర్ 2న గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.




1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో గాంధీ జన్మించాడు


తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబం నుంచి వచ్చిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బాల్యంలో కాస్త నిదానంగా ఉండే వాడు. చిన్నతనం నుంచి అబద్ధాలకు దూరముగా ఉండేవాడు. చదువులో గాంధీ మధ్యస్థంగా ఉండేవాడు. గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా పని చేసేవాడు. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు.

మాంసం తిన్నాడు.. పొగ తాగాడు : 
పోర్ బందర్, రాజ్‌కోట్ లో గాంధీ చదువు కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించారు. గాంధీజీ సరిగా సమాధానాలు రాయలేకపోయాడు. తోటీ విద్యార్థిల జవాబులను చూసి రాయమని మాస్టర్ ప్రోత్సహించాడు. అందుకు గాంధీ నిరాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ తాగడం, మాంసం తిన్నాడు.

ఆ మూడు జోలికి పోలేదు : 
అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. ఈ విషయంలో మరోసారి తప్పు చేయనని తల్లి దండ్రులకు మాట ఇచ్చాడు. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణుడై అనంతరం బారిష్టర్ కోర్సు కోసం లండన్ వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం.. ఆయన మాంసానికి, స్త్రీ సాంగత్యానికి, మద్యానికి దూరంగా ఉన్నారు. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివారు.

అప్పుడే గాంధీకి చదువు, వ్యక్తిత్వం, ఆలోచనా సరళీ రూపాంతరం చెందాయి. గాంధీకి 13ఏళ్ల వయస్సులో కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు (హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ) ఉన్నారు


Additional information


అక్టోబర్ 2వ తేదీన గాంధీ 150వ జయంతి. గాంధీ పూర్తి పేరు.. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. 1869 అక్టోబరు 2వ తేదీన గుజరాత్ లోని కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో ఆయన జన్మించారు. తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. గాంధీ బాల్యంలో చాలా నిదానంగా ఉండే వారు. పోరు బందర్ సంస్ధానంలో గాంధీజీ తండ్రి ఒక దివాన్ గా పనిచేసేవారు. గాంధీజీ బాల్యం తల్లి దండ్రుల సంరక్షణలోనే కొనసాగింది.

ఆట పాటల్లో కూడా పెద్దగా ఆసక్తి కనబర్చేవారు కాదు. పాఠశాల విడిచిన వెంటనే ఇంటికి వెళ్లి పోయేవాడు. విద్యార్థి దశలో గాంధీ అబద్దాలకు దూరముగా ఉండేవారు. చదువులో గాంధీ మధ్యస్థంగా ఉండేవారు. తరగతి గదిలో ఎప్పుడూ వెనుక వరుస సీట్లలోనే కూర్చొనేవారు


పోర్ బందర్ లో ప్రాథమిక విద్యను అభ్యసించిన గాంధీ.. రాజ్ కోట్ లో ఉన్నత విద్యను పూర్తి చేశారు.

కాపీ కొట్టమన్న మాస్టర్.. నిరాకరించిన గాంధీ : 
విద్యార్థి దశలో ఒకసారి గాంధీకి పెద్ద పరీక్ష ఎదురైంది. చదువులో అంతంతమాత్రం చదివే గాంధీకి పరీక్ష ఎదుర్కొన్నారు. గాంధీ చదివే పాఠశాలకు ఓ మాస్టర్ వచ్చి పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో ఆయన ఉత్తర్ణీత కాలేకపోయారు. పరీక్షలో వచ్చిన ఏ ప్రశ్నకు కూడా సరైన సమాధానాలు రాయలేకపోయారు. గాంధీని కూడా ఆయన పరీక్షించారు. పరీక్షలో సమాధానాలు రాలేక ఇబ్బందిపడుతున్న గాంధీని గమనించిన ఆ కొత్త మాస్టారు.. పక్క విద్యార్థుల సమాధానాలను చూసి రాయమని అన్నారు. అందుకు తాను రాయనని గాంధీ సూటిగా చెప్పేశారు. విద్యార్థి దశలోనే గాంధీకి బాల్యవివాహం జరిగింది. 13ఏళ్ల వయస్సులోనే కస్తూరి బాయిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నలుగురు సంతానం. వారిలో హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ ఉన్నారు.

లండన్‌లో బారిస్టర్ విద్య : 
వివాహమైనప్పటికి గాంధీజీ చదువును కూడా కొనసాగించారు. మెట్రిక్యులేషన్ పరీక్ష రాసి ఉత్తీర్ణుడు అయ్యారు. బాల్యం ఆరంభంలో చదువుల్లో మధ్యస్థంగా ఉన్నప్పటికీ బారిస్టర్ కోర్సు చదవాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది. తన 17ఏళ్ల వయస్సులో బారిస్టర్ న్యాయ విద్య చదివేందుకు లండన్ పట్టణానికి బయల్దేరి వెళ్లాడు. అప్పటికే చెడు అలవాట్లకు గురైన గాంధీ విషయంలో ఆయన తల్లి పుతిలీ బాయి ఆందోళన పడింది. లండన్ లో గాంధీ ఇంకా చెడు వ్యసనాలకు బానిస అవుతాడమేనని భయపడింది. లండన్ వెళ్లే ముందు గాంధీతో ప్రమాణం చేయించుకుంది. బాగా చదువుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చెప్పింది.

తల్లి బాధను అర్థం చేసుకున్న గాంధీ.. సరే అని మాట ఇచ్చాడు. అలానే బారిస్టర్ న్యాయ విద్యను విజయవంతంగా పూర్తి చేశారు. అనంతరం గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం ముంబాయి, రాజ్‌కోట్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ, గాంధీ ఆ వృత్తిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గాంధీజీ 1893లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో లా కంపెనీలో ఏడాది పాటు కాంట్రాక్టు న్యాయవాదిగా పనిచేశారు

అప్పుడు బ్రిటీష్ పాలన కొనసాగుతోంది. భారత్ దేశాన్ని అక్రమించిన తెల్లదొరలు ఏలుతున్న రోజులువి. మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన గాంధీ.. బారిష్టర్ లా కోర్సు చదివేందుకు తన 17వ ఏళ్ల వయస్సులో లండన్ నగరానికి వెళ్లాడు. బారిస్టర్ పూర్తి చేసిన అనంతరం గాంధీ స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వెళ్లేందుకు రైలు ఎక్కిన గాంధీకి అడుగుడుగునా అవమానాలే ఎదురయ్యాయి. తెల్లవాడు కాదనే కారణంతో ఆయన్ను రైల్లో నుంచి బయటకు నెట్టివేశారు. నల్లజాతి వారికి రైల్లో ప్రవేశం లేదని ఘోరంగా అవమనించారు. ఆయన గాంధీ ఎంతమాత్రం ధైర్యం కోల్పో లేదు. తన మనస్సును ఇంకా ధృడపరుచుకుని ముందుకు సాగారు. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివారు


అప్పుడే గాంధీకి చదువు, వ్యక్తిత్వం, ఆలోచనా సరళీలో మార్పులు వచ్చాయి.

బారిస్టర్ పూర్తి చేసి స్వదేశానికి : 
1891లో బారిస్టర్ పూర్తి చేసి లండన్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చారు. అనంతరం ముంబాయి, రాజ్‌కోట్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. కానీ, గాంధీ ఆ వృత్తిలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. గాంధీజీ 1893లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. 1893లో దక్షిణాఫ్రికాలోని నాటల్‌లో లా కంపెనీలో ఏడాది పాటు కాంట్రాక్టు న్యాయవాదిగా పనిచేశారు. ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. ట్రాన్స్ వాల్ నగరంలో ఫోక్స్ ఆశ్రమాన్ని స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపియన్ అనే వార పత్రికను స్ధాపించారు.



నాయకత్వ బీజాలు పడింది ఇక్కడే : 
1915 జనవరి 9న దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అని సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసుకున్నాడు.

ఏడాది వరకు పనిమీద వెళ్ళిన గాంధీ.. దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు (1893 నుంచి 1914 వరకు) గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైల్లో మొదటి తరగతి నుంచి నెట్టివేశారు. హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతను గాంధీ ఎదుర్కొన్నారు. అప్పుడే రాజకీయ విధివిధానాలు రూపు దిద్దుకోవడానికి పునాది పడింది. దేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు పడ్డాయి. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం అప్పుడే చిగురు వేస్తోంది.


ఆంగ్లేయుల పాలన నుంచి భారత దేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో జాతిపిత అగ్రగణ్యుడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము మహాత్మాగాంధీ పూజా సామాగ్రి. 20వ శతాబ్ధిలోని రాజకీయ నాయకులలో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన గొప్ప నాయకుడు. కొల్లాయిగట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలు, కులాలు ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహము, అహింస పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు.అందుకే ఆయన భరత జాతికి జాతిపిత అయ్యారు. 
20ఏళ్ల దక్షిణాఫ్రికా ఉద్యమం.
గాంధీజీ జీవితానికి ఉద్యమ స్వరూపం తప్ప మరో రూపం లేదు. వేరే రూపు రేఖలూ లేవు

ఈ భారతీయుడి జీవితం ఇంగ్లాండ్‌లో మొదలైంది. దక్షిణాఫ్రికాలో పదును తేలింది. భారత్‌లో కదం తొక్కింది. సముద్రయానం హిందువులకు నిషిద్ధం. నిషేధాన్ని దిక్కరించి 'లా చదవడం కోసం 1888లో ఇంగ్లాండు వెళ్లారు గాంధీజీ. మూడేళ్లు లండన్‌లో ఉండి వచ్చారు. ముంబైలో 'లా ప్రాక్టీస్‌ పెట్టారు. 1893లో దక్షిణాఫ్రికాలో ఒక భారతీయ ముస్లిం కంపెనీ దావాలో వాదించడానికి జూనియర్‌ లాయర్‌గా వెళ్లే అవకాశం వస్తే డర్బన్‌ బయిల్దేరి వెళ్లారు. అలా వెళ్లడంతో దక్షిణాఫ్రికాలోనే 21 ఏళ్లు (1893-1914) గడిపారు. దక్షిణాఫ్రికాలో అనుభవాలు, అనుమానాలు, పరాజయాలు ఆయన్ని ఓ ఉద్యమ శిల్పంలా చెక్కాయి. 
30ఏళ్ల స్వదేశీ ఉద్యమం..
1914లో దక్షిణాఫ్రికా నుంచి తిరుగు ప్రయాణమై, మధ్యలో కొన్నాళ్లు లండన్‌లో ఉండి, అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో 1915లో గాంధీజీ ఇండియా చేరుకునే నాటికి..ఇక్కడ స్వాతంత్య్రకాంక్ష ఉధృతరూపం దాలుస్తూ ఉంది. గాంధీజీ ఏడాది పాటు దేశమంతా తిరిగారు. మొదటి శాంతినికేతన్‌ వెళ్లి ఠాగూర్‌ను కలుసుకున్నారు. తర్వాత గుజరాత్‌ వచ్చారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీ తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఇండియాలో కూడా దక్షిణాఫ్రికాలో పరిస్థితులే. తెల్లవాళ్లు, నల్లవాళ్లు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రభుత్వంపై ఉద్యమకారుల ఆగ్రహాలు. బీహార్‌లోని చంపారన్‌ జిల్లాలో నీలిమందు పండించే పేద రైతుల పట్ల తెల్లజాతి యజమానులు అనుసరిస్తున్న దోపిడి విధానంపై ప్రతిఘటనతో 1917లో భారత్‌లో మొదలైన గాంధీజీ ఉద్యమ జీవితం..రౌలత్‌ చట్టం, జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం, సహాయ నిరాకరణ, ఖిలాపత్‌ ఉద్యమం, చౌరాచౌరీ ఘటన, సంపూర్ణ స్వరాజ్య తీర్మాణం, ఉప్పు సత్యాగ్రహం, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, ఆమరణ నిరాహారదీక్ష.వంటి వాటితో 1932 నాటికి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అధ్యాయం అయ్యింది.1933లో గాంధీజీ సబర్మతి నుంచి మహారాష్ట్రలోని వార్ధా వచ్చి అక్కడ సేవాగ్రాం పేరుతో ఆశ్రమం నెలకొల్పారు. అక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. హరిజన్‌ వారపత్రిక స్థాపించారు. హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టారు. ఖాదీ ఉద్యమం ప్రారంభించారు. తర్వాత రాజకీయ ఉద్యమం. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం. బ్రిటిష్‌ వారు వెళ్లిపోయారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికి గాంధీ వయసు 77ఏళ్లు. 1917 నుంచి 1947వరకు 30ఏళ్లు గాంధీజీ ఉద్యమ జీవితం గడిపారు. 




మౌంట్‌బాటన్‌ ప్లాన్‌.
1945 నాటికి బ్రిటిష్‌ ప్రభుత్వానికీ, భారత జాతీయ కాంగ్రెస్‌కు మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. 'మౌంట్‌ బాటన్‌ ప్లాన్‌ తయారైంది. ఆ ప్రకారం 1947లో బ్రిటిష్‌ ఇండియా విభజన జరిగి ఇండియా, పాకిస్తాన్‌ అనే రెండు స్వతంత్య్ర రాజ్యాలు మత ప్రాతిపదికన ఏర్పాటయ్యాయి. అయితే విభజనకు ముందు, తర్వాత కూడా కొన్ని నెలల పాటు రెండు ప్రాంతాల్లో మతకల్లోలం చెలరేగింది. గాంధీజీ ఈ విభజనను వ్యతిరేకించారు. కల్లోలాన్ని చల్లబరిచేందుకు ఆయన కలకత్తా, ఢిల్లీలలో నిరాహార దీక్షలు చేపట్టారు కూడా. అటు, ఇటు.ప్రజలు ప్రభుత్వాలు సద్దుమణిగే సమయంలో మహాత్మాగాంధీ హత్యకు గురయ్యారు. గాంధీజీ మరణం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మహాత్ముడికి మరణం అనేది ఉంటుందా? ఉందదు. మానవాళి గాంధీమార్గంలో నడుస్తున్నంతకాలం ఏ తరంలోనైనా మహాత్ముడు జీవించి ఉన్నట్లే



నైనిటాల్, సెప్టెంబర్ 30: భారతదేశంలో ఏ మూలకు వెళ్లినా ఏ కుగ్రామాన్ని సందర్శించినా ఏదోరకంగా బాపూజీ జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉంటాయి. ఆయన విగ్రహమో లేదా ఆయన పేరిట ఏర్పాటు చేసిన ఓ గ్రంథాలయమో కట్టడమో అలాగే ఆయన పర్యటించిన ఆనవాళ్లను జ్ఞప్తికి తెచ్చే అంశాలో ఏవో ఒకటి ప్రతిఒక్కర్నీ అలరిస్తాయి.
ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు ఇప్పటికీ చిరస్మరణీయంగా ఆచరణీయంగా ఉన్నాయంటే యావత్ భారతంపైన ఆయన వేసిన వ్యక్తిత్వ ముద్రే బలమైన కారణం. అలాంటిదే ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వరి జిల్లాలో గల అనాసక్తి ఆశ్రమం. దాదాపు 90 ఏళ్ల క్రితం అంటే 1929 వేసవిలో ఈ ఆశ్రమాన్ని గాంధీజీ సందర్శించారు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఈ ఆశ్రమంలో సజీవంగా ఉన్నాయి. మహోన్నత హిమాలయ సానువుల్లో ఉన్న ఈ ఆశ్రమాన్ని సందర్శించే ప్రతిఒక్కరూ గాంధీ వ్యవహరించినట్టుగానే వ్యవహరించారు


ఆయన ప్రవచించిన గాంధేయ జీవన విధానాన్ని అనుసరించారు. అందుకే ఆనాటి నుంచి నేటివరకు మహాత్ముడి జ్ఞాపకాలు నిత్యనూతనంగా పలకరిస్తూనే ఉన్నాయి.
ఈ ఆశ్రమం నలుమూలలా ఆనాటి గాంధీ పర్యటనకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ప్రతిఒక్కర్నీ అలరిస్తాయి. 1929లో యావత్ భారతాన్ని చుట్టివచ్చేందుకు బయలుదేరిన గాంధీజీ ఈ అనాసక్తి ఆశ్రమానికి వచ్చారు. కేవలం రెండు రోజులే అక్కడ ఉండాలనుకున్నారు. కానీ ఆ ఆశ్రమం చుట్టూ పరివేష్టించిన హిమాలయాలు, ప్రకృతి సౌరభం ఆయనను మంత్రముగ్ధుడ్ని చేసింది. అంతే..ఓ స్థానిక తేయాకు ఎస్టేట్ యజమాని అతిధిగా ఏకంగా రెండువారాలు అక్కడే ఉండిపోయారు. ఆనాటి ఆ రెండు వారాల గాంధీ జ్ఞాపకాలను ఈ ఆశ్రమం, అలాగే ఈ ప్రాంతం చిరస్మరణీయంగా నిత్య ఆరాధనీయంగా మార్చాయి. ఈ ఆశ్రమంలో ఉన్న రెండు వారాలు కూడా మహాత్మాగాంధీ భారతీయ తత్వానికి అద్దం పట్టిన భగవద్గీత శ్లోకాలను అనువదించడంలోనే గడిపారు. 'ఈ ఆశ్రమంలో గడిపేందుకు వచ్చిన ప్రతిఒక్కరికీ గాంధీ తత్వం బోధపడుతుంది. బాత్‌రూమ్‌ల శుభ్రత, ప్రార్థన, ధ్యానం, అనాసక్తి యోగా గురించి తెలుసుకోవడం, ప్రకృతి సౌరభాన్ని ఆస్వాదించడం, సాత్వికాహారం తీసుకోవడం వంటివి అలవడతాయి. ప్రతిఒక్కరు కూడా మహాత్ముడి బోధనలకు ప్రభావితులవుతారు' అని ఇటీవలే ఈ ఆశ్రమాన్ని సందర్శించిన రితీషా శర్మ తన అనుభవాలను వెల్లడించారు. ఈ ఆశ్రమ భవనం ముందు మహాత్ముడి విగ్రహం, అలాగే చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అన్న మూడు కోతుల బొమ్మలు అతిధులకు ఆహ్వానం పలుకుతాయి. అలాగే ఈ ఆశ్రమంలోని గోడలన్నీ కూడా మహాత్ముడి జీవితానికి సంబంధించిన అన్ని ఘట్టాలకు అద్దం పడతాయి. ఒక గోడ మీద అయితే ఏకంగా మహాత్ముడి జీవిత చరిత్రే దర్శనమిస్తుంది. మరోగోడ మీద తరతరాలైన కుటుంబాన్ని కూడా కళ్లకు కడుతుంది. అలాగే ఈ క్యాంపస్‌లో ఉన్న ప్రతి గోడమీద ఏదో ఒక చోట మహాత్ముడి సూక్తి లేదా ప్రవచనాలు ప్రతిఒక్కర్నీ అలరిస్తాయి. ఈ ప్రాంతం తనను ఎంతగానో ఆకర్షించిందంటూ ఆనాడు రాసిన వివిధ లేఖలు కూడా మరోగోడ మీద కనిపిస్తాయి. ఇక్కడ నుంచే గాంధీజీ తన కొడుకు మనీలాల్, కోడలు సుశీలకు రాసిన లేఖ కూడా ఈ ఆశ్రమంలో కనిపిస్తుంది. 'నేను మీకు హిమాలయాల నుంచే రాస్తున్నాను. మంచుతో ఆవృతమైన వాటిని చూస్తూ ఆనందిస్తున్నాను. రోజంతా ఈ దృశ్యాన్ని తిలకిస్తూ బాల్కనీలోనే గడిపాను. అక్కడే గీత శ్లోకాలను అనువదించాను' అని మహాత్ముడు ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ ఆశ్రమంలో 25 గదులు ఉంటాయి. వాటితోపాటు దీనిని సందర్శించేందుకు వచ్చిన ప్రతిఒక్కరు కూడా ప్రార్థన లేదా ధ్యానం చేయాలన్న నిబంధన ఉంది.



ఇందులోనే మహాత్ముడి జీవితానికి సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం కూడా ఉంది. అప్పట్లో గాంధీజీ ఉన్న ఇల్లు కొనే్నళ్లపాటు అతిథిగృహంగానే కొనసాగింది. అనంతరం అప్పటి యూపీ ముఖ్యమంత్రి సుచేతా కృపాలనీ ఈ భవనాన్ని గాంధీ స్మారక కేంద్రానికి అప్పగించారు. ఆ విధంగా గాంధీజీ జ్ఞాపకాలను పదిలపరచుకునేందుకు ఆమె దోహదం చేశారని ఆశ్రమ మేనేజర్ రమేష్ చంద్ర పాండే తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "తల్లికి మాటిచ్చిన గాంధీ.. జీవితంలో ఆ మూడు ముట్టలేదు!"

Post a Comment