నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం!
అమరావతి, అక్టోబర్ 7: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటవ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. గత ఐదేళ్లుగా రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలకు బదులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్త రాష్ట్ర నిర్మాణం దిశగా ప్రజలను జాగృతం చేసేందుకు జూన్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షల పేరిట రోజుకో కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిని ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని భావించారు. అయితే ఈ అంశం అంతగా ప్రజల్లోకి చేరలేదు. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్టోబర్ 1న ఏర్పడిందని, పాలనాపరంగా నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినందున అక్టోబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలంటూ ఏపీ మేధావుల ఫోరం కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాసింది
ఈ నేపథ్యంలో రాష్ట్రావతరణ దినోత్సవం ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశం గా మారింది. విభజన అనంతరం జూన్ 2వ తేదీని తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రెండు తెలుగు రాష్ట్రాలు అదే రోజున అవతరణ దినోత్సవాలు జరుపుకోవచ్చని సూచించింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తమది అవశేష ఆంధ్రప్రదేశ్ కనుక ఎప్పుడు అవతరణ దినోత్సవం నిర్వహించాలనే విషయమై కేంద్రం స్పష్టత ఇవ్వాలని లేఖ రాసింది.
ఈ మేరకు నవంబర్ 1న అవతరణ వేడుకలు జరుపుకోవాలని కేంద్రం అప్పట్లో సూచించింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత విభజన సందర్భంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నిరసిస్తూ జూన్ 2 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు తప్ప ఐదేళ్లుగా అవతరణ వేడుకలకు రాష్ట్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అవతరణ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 30వ తేదీన అవతరణ వేడుకలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా వర్గీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే పూర్వ వైభవం సంతరించు కోగలదని, ఈ నేపథ్యంలో అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరుపుకోవటమే మంచిదని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఈనెల 16వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
ఈ మేరకు నవంబర్ 1న అవతరణ వేడుకలు జరుపుకోవాలని కేంద్రం అప్పట్లో సూచించింది. అవశేష ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తరువాత విభజన సందర్భంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని నిరసిస్తూ జూన్ 2 నుంచి వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్షలు నిర్వహించారు తప్ప ఐదేళ్లుగా అవతరణ వేడుకలకు రాష్ట్రం నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం అవతరణ వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 30వ తేదీన అవతరణ వేడుకలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని కూడ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా వర్గీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్టుగానే పూర్వ వైభవం సంతరించు కోగలదని, ఈ నేపథ్యంలో అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న జరుపుకోవటమే మంచిదని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. ఈనెల 16వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం
0 Response to "నవంబర్ 1న రాష్ట్రావతరణ దినోత్సవం!"
Post a Comment