'రైతుభరోసా' విధివిధానాలు విడుదల
పదివేల పెన్షన్ తీసుకుంటున్నా అనర్హులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
రైతు భరోసా విడుదలకు సంబంధించి రైతులు, కౌలు రైతుల మధ్య ఒప్పందం చేసుకునే పంటసాగు హక్కు పత్రాలను, విధివిధానాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుండి ఈ పత్రాలు అమల్లోకి రానున్నాయి. సాగుదారులకు 11 నెలలపాటు పంటపై హక్కు ఉండే విధంగా నిబంధనలు రూపొందించింది. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ఈ ఒప్పందాలపై ఎటువంటి
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
రైతు భరోసా విడుదలకు సంబంధించి రైతులు, కౌలు రైతుల మధ్య ఒప్పందం చేసుకునే పంటసాగు హక్కు పత్రాలను, విధివిధానాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుండి ఈ పత్రాలు అమల్లోకి రానున్నాయి. సాగుదారులకు 11 నెలలపాటు పంటపై హక్కు ఉండే విధంగా నిబంధనలు రూపొందించింది. గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే ఈ ఒప్పందాలపై ఎటువంటి
చట్టపరమైన దావా వేసే అవకాశం లేదు. సాగుదారులు తీసుకునే బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించే విషయంలో బ్యాంకులకు పంటమీద తప్ప నేలమీద హక్కు ఉండదని నిబంధనల్లో పేర్కొన్నారు. వాణిజ్యపన్ను, వృత్తిపన్ను, జిఎస్టిలను చెల్లించినవారు, వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, సిఏ, ఆర్కిటెక్ట్లు, రిజిస్టర్ అయ్యే వృత్తులు చేసేవారు రైతు భరోసాకు అనర్హులని నిబంధనలో పేర్కొన్నారు
ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన వారు రూ.10 వేలు పెన్షన్ తీసుకుంటున్నా రైతుభరోసాకు అనర్హులుగా పేర్కొన్నారు
0 Response to "'రైతుభరోసా' విధివిధానాలు విడుదల"
Post a Comment