2.76 లక్షల కోట్లు!
* నాలుగేళ్లలో 1.28 లక్షల కోట్లు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి:
'విభజన జరిగే సమయానికి రాష్ట్రానికి 1.48 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు, తాజాగా 2.76 లక్షల కోట్లకు చేరిదని ఆర్థికశాఖ తేల్చింది. ఈ మేరకు పూర్తి వివరాలతో ఒక నివేదికను ఆ శాఖ తయారుచేసింది. ఈ నివేదిక ప్రకారం గడిచిన నాలుగేళ్ల కాలంలో 1.28 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకుంది సొంత ఆదాయ వనరులు పెరగక పోవడం, కేంద్రం నుండి ఆశించిన నిధులు రాకపోవడంతో అప్పులు అనివార్యమయ్యాయని పేర్కొంటూనే, ఈ పరిస్థితిపై ఆర్థికశాఖ ఆందో ళనను వ్యక్తం చేసింది. ఆఫ్బడ్జెట్ బారోయిరగ్స్ కూడా భారీగా కనిపించడం దీనికి కారణం
జిఎస్డిపి పరిధి దాటి....
ప్రస్తుతం చేసిన రుణం జిఎస్డిపిలో 25.89 శాతంగానే ఉన్నప్పటికీ రానున్న కాలంలో పరిమితి దాటిపోయే ప్రమాదం ఉంది. జిఎస్డిపిని 1.06 లక్షల కోట్లుగా అరచనా వేయగా, ప్రస్తుతర ఉన్న 25.89 శాతం రుణం 28 శాతం దాటిపోతురదన్న ఆందోళన ఆర్థికశాఖ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చూపిస్తున్న 2.76 లక్షల కోట్ల రుణానికి అదనంగా వివిధ సంస్థల నురచి తీసుకున్న ఆఫ్ బడ్జెట్ బారోయిరగ్స్ కూడా జత చేయాల్సి ఉరటురది. ఇవి ఎనిమిది వేల కోట్ల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ నురచి 5వేల కోట్లు, డిస్కామ్ల నురచి 2250 కోట్లు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగిరచుకురది. ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటకుండా చూసుకునేరదుకుగాను త్వరలో మరికొన్ని రుణాలను కూడా సంస్థల పేరున తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోరది
0 Response to "2.76 లక్షల కోట్లు!"
Post a Comment