విద్యాశాఖలో సాంకేతికతకు పెద్దపీట : ఆదిమూలపు సురేష్
సీఎం ఐటీ సలహాదారు రాజశేఖరరెడ్డితో కలసి సచివాలయంలోని తన చాంబర్లో మంత్రి అధికారులతో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. డిజిటల్ తరగతి గదులు, ఈ-హాజరు, ఆధార్ నమోదు ప్రక్రియ, ఆన్లైన్లో బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ తదితర చర్యల వల్ల పారదర్శకతకు దోహదపడుతుందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు కార్యక్రమంపై అధికారులకు పలు సూచనలు చేశారు
పూర్తి స్థాయి లో టెక్నాలజీ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, అవసరమైన నిధుల వివరాలపై సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, సాంకేతిక విద్య, కాలేజీ విద్య, పాఠశాల విద్య కమిషనర్లు అహమ్మద్ బాబు, సుజాతశర్మ, సంధ్యారాణి, సర్వశిక్ష అభియాన్ ఎస్పీడీ వి.చినవీరభద్రుడు, అధికారులు పాల్గొన్నారు
0 Response to "విద్యాశాఖలో సాంకేతికతకు పెద్దపీట : ఆదిమూలపు సురేష్"
Post a Comment