మూడోవారం నుంచి ఆర్థిక గణన : సిఎస్

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో 
ఈనెల మూడో వారం నుంచి రాష్ట్ర 7వ ఆర్థిక గణన (ఎకనమిక్‌ సెన్సస్‌) ప్రారంభమవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈ ఆర్థిక గణనకు సంబంధించి రాష్ట్ర స్థాయి కో ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం బుధవారం సచివాలయంలో సిఎస్‌ అధ్యక్షతన జరిగింది. ఒకే రోజు అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు ఎకనమిక్‌ సెన్సస్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా శాఖ కార్యదర్శి సంజరు గుప్తాను సిఎస్‌ ఆదేశించారు. ఎకనమిక్‌ సెన్సస్‌ నిర్వహించే ఎన్యూమరేటర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారి ద్వారా ఇంటింటా ఆర్థిక గణాంక వివరాలు పటిష్టంగా సేకరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు




ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లపై సంజరు గుప్తా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఇప్పటివరకు 1977, 1980, 1990, 1998, 2005, 2013 సంవత్సరాల్లో ఆరు పర్యాయాలు ఎకనమిక్‌ సెన్సస్‌ వివరాలు సేకరిచామని తెలిపారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సిఎస్‌, జిల్లా స్థాయిలో కలెక్టర్‌ అధ్యక్షతన కోఆర్డినేషన్‌ కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సెన్సస్‌ నిర్వహణకు గ్రామాల్లో 8,027 మంది, పట్టణాల్లో 3,583 మంది మొత్తం 11,610 మంది ఎన్యూమరేట్లను నియమించామని వివరించారు.

ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మొదటిస్థాయిలో 3,111 మందిని, ద్వితీయ స్థాయిలో 762 మందిని సూపర్‌వైజర్లుగా నియమించామన్నారు. మొదటి స్థాయివారికి ఇప్పటికే శిక్షణ పూర్తికాగా, ద్వితియ స్థాయి సూపర్‌ వైజర్లకు 12, 13 తేదీల్లో శిక్షణ నిర్వహిస్తామని చెప్పారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు అనంతరాము, రజత్‌ భార్గవ, బి. ఉదయ లక్ష్మి, పరిశ్రమల, ప్రణాళిక శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "మూడోవారం నుంచి ఆర్థిక గణన : సిఎస్"

Post a Comment