ఆర్టీసి ఉద్యోగులకు డిఎ మంజూరు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:
ఆర్టీసి ఉద్యోగులకు జూన్‌ నుంచి చెల్లించాల్సిన 4.07 శాతం డిఎను మంజూరు చేస్తూ ఆర్టీసి యాజమాన్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 



పెరిగిన డిఎను ఈ నెల అరియర్స్‌తో పాటు సెప్టెంబర్‌ 1న చెల్లించాల్సిన జీతంతో చెల్లించనున్నారు. డిఎ మంజూరు చేయడంపై ఆర్టీసి ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఇయు) రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ 



ఫెడరేషన్‌(ఎస్‌డబ్ల్యూఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌కె జిలానీ బాషా, ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ సుందరయ్య వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆర్టీసి ఉద్యోగులకు డిఎ మంజూరు"

Post a Comment