రేపటి నుండి ఓటర్ల జాబితా సవరణ
* రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో:
సెప్టెంబర్ ఒకటవ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యమ్రాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె. విజయానంద్ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 30 వ తేది వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు సైతం ఓటరు కార్డులోని తప్పులను సరిదిద్దుకునేందకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు
ఆన్లైన్లోనూ...
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందున నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్, ఓటర్స్ హెల్ప్ మొబైల్ యాప్, 1950 కాల్సెంటర్ ద్వారా కూడా ఈ మార్పులను చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం సిబ్బంది క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సంబంధిత మార్పులు చేస్తారని తెలిపారు. వికలాంగ ఓటర్లు 1950 హెల్ప్లైన్ ద్వారా వివరాలు తెలియజేస్తే, వారి నమోదుకు సంబంధించి చర్యలు తీసుకుంటారని వివరించారు
0 Response to "రేపటి నుండి ఓటర్ల జాబితా సవరణ"
Post a Comment