ఇ-కామర్స్‌ నిబంధనల ముసాయిదా విడుదల

ఇ-కామర్స్‌ నిబంధనల ముసాయిదా విడుదల

దిల్లీ: వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు వీలుగా కేంద్రం ఇ-కామర్స్‌ నిబంధనలను రూపొందిస్తోంది. ఇ-కామర్స్‌ ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసి, సెప్టెంబరు 16 లోగా అభిప్రాయాలు తెలపాలని వాటాదార్లను వినియోగదారుల 


వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది  ఈ ముసాయిదా ప్రకారం.. ఇ-కామర్స్‌ సంస్థలు 14 రోజుల్లోగా నగదు వాపసు అభ్యర్థనను (రిఫండ్‌ రిక్వెస్ట్‌) పూర్తి చేయాల్సి ఉంటుంది. తమ వెబ్‌సైట్లలో వస్తు, సేవల విక్రయాలు జరుపుతున్న విక్రేతల వివరాల్ని ప్రదర్శించాలి. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించే విధానాన్ని కూడా రూపొందించాలి. 



వినియోగదారుల వ్యక్తిగత డేటా గోప్యతకు కూడా ఇ-కామర్స్‌ కంపెనీలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి డేటా సేకరణ, నిల్వ, ఉపయోగం ఐటీ (సవరణ) చట్టం 2008 ప్రకారం చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతోపాటు, కంపెనీలన్నీ 2011 ఐటీ నిబంధనలనూ పాటించాలి. ఇ-కామర్స్‌ సంస్థలు భారతీయ చట్టాలకు లోబడి 



న్యాయబద్ధమైన సంస్థగా నమోదు చేయించుకోవడంతో పాటు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని పేర్కొంటూ స్వీయ ధ్రువీకరణను  మంత్రిత్వ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇ-కామర్స్‌ నిబంధనల ముసాయిదా విడుదల"

Post a Comment