ఈ సాఫ్ట్వేర్తో సులువుగా ఆంగ్లం నేర్చుకోండి..
దిల్లీ: సులువుగా ఆంగ్ల భాష నేర్చుకునేలా ‘ఇంగ్లిష్ హెల్పర్’ అనే సంస్థ నూతన కృత్రిమమేధ(ఏఐ) సాంకేతికత సాయంతో సాఫ్ట్వేర్ను రూపొందించింది.
ఈ సంస్థ సీఈఓ సంజయ్గుప్త మాట్లాడుతూ.. రైట్ టు రీడ్ కార్యక్రమాన్ని తమ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ భాగస్వామ్యంతో 2015లో మహారాష్ట్రలోని 4వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేశామన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా మరో ప్రాజెక్టును రాష్ట్రంలోని 65వేల పాఠశాలల్లో అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
సాంకేతికత ఆధారంగా విద్యార్థులకు ఆంగ్లం నేర్పించేందుకు ఆ సంస్థ ముందడుగు వేస్తోంది. అందులో భాగంగా ఈ కంపెనీ మహారాష్ట్రలోని 65వేల పాఠశాలల్లో ఆంగ్లం నేర్పేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
గతంలో 2013 సంవత్సరంలో ఈ సంస్థ భారతదేశంలోని వేలాది ప్రభుత్వ పాఠశాలల్లో రైట్ టు రీడ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మల్టీసెన్సార్ ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా విద్యార్థుల్లో ఇంగ్లిష్ పఠనం, భాషలో తదితర నైపుణ్యాలు గణనీయంగా పెంచేలా చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం.
ఈ సంస్థ సీఈఓ సంజయ్గుప్త మాట్లాడుతూ.. రైట్ టు రీడ్ కార్యక్రమాన్ని తమ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంస్థ భాగస్వామ్యంతో 2015లో మహారాష్ట్రలోని 4వేల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేశామన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ద్వారా మరో ప్రాజెక్టును రాష్ట్రంలోని 65వేల పాఠశాలల్లో అమలు చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందని తెలిపారు.
ఇది విద్యార్థులకు గ్రేడ్ల వారీగా ఇంగ్లిష్ నేర్చుకునేలా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందన్నారు. ఈ సాఫ్ట్వేర్ను ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ ద్వారా ఉపయోగించుకునేలా రూపొందించామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 15 మిలియన్ల మంది విద్యార్థులకు, 2లక్షల మంది
ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ సాధన చేసేందుకు తోడ్పడుతుందన్నారు. అధునాతన సాంకేతికతతో విద్యలో మార్పు తీసుకురానున్న ఈ ప్రాజెక్టు అమలులో కృషి చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం కలసిరావాలని ఆయన అన్నారు
0 Response to "ఈ సాఫ్ట్వేర్తో సులువుగా ఆంగ్లం నేర్చుకోండి.."
Post a Comment