అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు, సీనియారిటీ, సర్వీస్ రూల్స్ పరిష్కరించేందుకు సిద్ధంగా - మంత్రి సురేష్
విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
పేదరికం వల్ల బాల బాలికలు విద్యకు దూరం కాకూడదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
పేదరికం వల్ల బాల బాలికలు విద్యకు దూరం కాకూడదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
విద్యా విధానంపై సుదీర్ఘ చర్చ జరపాలన్న శాసనమండలి ఛైర్మన్ ఆదేశాల మేరకు విద్యా సంబంధమైన ఎమ్మెల్సీలు, విద్యాశాఖ అధికారులతో బుధవారం విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆయన సమావేశం నిర్వహించారు.
ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, నియామకాలు, సీనియారిటీ, సర్వీస్ రూల్స్ పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సురేష్ అన్నారు.
రేషనలైజేషన్లో భాగంగా మూతబడిన పాఠశాలలు తెరవాలని ప్రజా ప్రతినిధులు తెలియజేస్తే తక్షణమే వాటిని పున:ప్రారంభిస్తామన్నారు
నెలలో ప్రతి మొదటి, 3వ శనివారాలలో నో బ్యాగ్ డే ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. జాతీయ నూతన విద్యావిధానం కోసం సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశాన్ని ఈ నెల 17 వరకు పొడిగించామన్నారు
ఇచ్చిన హామీలలో భాగంగా ఇంగ్లీషు మీడియం ఏర్పాటు, మాతృ భాషా వికాసం, నైపుణ్యాభివృద్ధి, పాఠశాలల రూపురేఖలు మార్చే కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించామన్నారు.
నెలలో ప్రతి మొదటి, 3వ శనివారాలలో నో బ్యాగ్ డే ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. జాతీయ నూతన విద్యావిధానం కోసం సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశాన్ని ఈ నెల 17 వరకు పొడిగించామన్నారు
మాటలు కాదు చేసి చూపించాలి బాషా పండిత
ReplyDeleteసమస్య త్వరగా పరిష్కారం చేయాలి