ఎస్బీఐ గృహరుణాలు మరింత చౌక..
దిల్లీ: స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను 15బేసిస్ పాయింట్ల మేరకు తగ్గించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 10వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వడ్డీరేట్లను తగ్గించడం వరుసగా ఇది నాలుగో సారి. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించిన వెంటనే ఎస్బీఐ నుంచి వడ్డీరేట్ల తగ్గింపు ప్రకటన రావడం విశేషం.
రెపోరేటు కూడా వరుసగా నాలుగో సారి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్బీఐ కొత్త రేట్ల ప్రకారం ఎంసీఎల్ఆర్ ఏడాది కాల వ్యవధి రుణాలకు 8.25గా ఉండనుంది. ఇప్పటి వరకు ఇది 8.40శాతంగా ఉంది. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఇప్పటి వరకు 35బేసిస్ పాయింట్ల మేరకు గృహరుణ వడ్డీరేట్లు తగ్గాయి
''ఆర్బీఐ అందించే వడ్డీ రేట్ల తగ్గింపు ఫలాలను పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నాం. ఈ ఏడాది రెపోరేటు 85బేసిస్ పాయింట్లు తగ్గింది.
రూ.లక్ష కంటే క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ వినియోగదారులకు దీనిని అందించాము.'' అని ఎస్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది
0 Response to "ఎస్బీఐ గృహరుణాలు మరింత చౌక.."
Post a Comment