కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి):ఇదిలావుండగా, ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు యాజమాన్యం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఈయూ నేతలు తెలిపారు. ఆర్టీసీలో పదేళ్లుగా కారుణ్య నియామకాలు నిలిచిపోయాయని, దీనివల్ల 1,065 పోస్టులు పెండింగ్‌లో

ఉన్నాయన్నారు. వీరిలో 2012 డిసెంబరు 31కి ముందుగా ఉన్న 313 మందికి ఈనెలాఖరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు ఎండీ సురేంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.

కారుణ్య నియామకాల్లో మిగిలినవారికి కూడా ఈ ఏడాది డిసెంబరులోగా దశలవారీగా ఉద్యోగాలు ఇస్తారని వారు తెలిపారు. ఈ నెలలో కారుణ్య నియామకాలు పొందే వారిలో 246 మంది కండక్టర్లు, 67 మంది శ్రామిక్‌గా దరఖాస్తు చేసుకున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కారుణ్య నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌"

Post a Comment