నిజానికి.. భారత జాతీయ పతాకానికి చాలా చరిత్ర ఉంది. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్న రూపానికి రాకముందు అనేక మార్పులకు లోనయింది.
అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదే మాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు.
పాఠ్యపుస్తకాల్లోనూ జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య అని బోధిస్తున్నారు.19 ఏళ్ల వయసులో పింగళి వెంకయ్య దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోరర్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అక్కడే జాతిపిత మహాత్మాగాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన సాన్నిహిత్యం అర్థశతాబ్దం పాటు నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో 1876 ఆగస్టు 2న జన్మించిన పింగళి.
చిన్న వయసులోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు. భారతదేశం తిరిగివచ్చాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో భారత జాతీయ పతాకం రూపకల్పన మీద ఆసక్తి కలిగింది. ఆయన 1916లో తన ఆలోచనలతో 'ఎ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా' అనే పుస్తకం రాశారు. అందులో 24 రకాల జెండా నమూనాలను ప్రతిపాదించారు.
1921లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చాలా కీలక పాత్ర పోషించింది. అప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు రూపొందించిన జాతీయ పతాకాలు సామన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ.. పింగళి రూపొందించిన పతాకం.. జాతీయోద్యమ పతాకంగా మారింది. దీంతో జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య.
నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఆయనను ప్రజలు మరచిపోతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రజలకు ఆయన దర్శన భాగ్యాన్ని కలిగోంది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం.
పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని 2011లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అదేమీ కార్యరూపం దాల్చలేదు.l
వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు.
కూతురు సీతామహలక్ష్మి మాచర్లలో నివసిస్తున్నది. వెంకయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకొడుకు పరశురాం జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేశాడు. రెండవ కుమారుడు చలపతిరావు సైన్యంలో పనిచేస్తూ చిన్నవయసులోనే మరణించాడు. కూతురు సీతామహలక్ష్మి మాచర్లలో నివసిస్తున్నది. ఇదిలా ఉండగా ఇటీవల సోషల్ మీడియాలో పింగళి వెంకయ్య కుటుంబ సభ్యుల గురించి భిన్న కధనాలు వైరల్ అవుతున్నాయి
. కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో అయితే పంగళి గారి కొడలు ధీనావస్థలో ఉన్నట్టు ప్రచారం జరగడం దురదృష్టకరం. వాస్తవానికి వెంకయ్య కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉన్నట్టు సమాచారం. సోషల్ మీడియా వైరల్ అవుతున్న దానిలో ఎలాంటి వాస్తవం లేదు. ఇలాంటి ప్రచారాన్ని పరిగణలోకి తీసుకోవద్దని పింగళి అభిమానులకు ఆయన కుటుంబ సభ్యులు సూచిస్తున్నారు
0 Response to "చరిత్ర పుటల్లో 'పింగళి వెంకయ్య"
Post a Comment