బ్యాంకుల పనివేళల్లో మార్పు! ఇక అన్ని బ్యాంకులకు ఒకే టైమ్‌

*®బ్యాంకుల పనివేళల్లో మార్పు! ఇక అన్ని బ్యాంకులకు ఒకే టైమ్‌?*

*బ్యాంక్ ఖాతాదారులకు మరో తీపికబురు రాబోతోంది*
*ఇక ప్రభుత్వ రంగ (పీఎస్‌బీ) బ్యాంకులన్నీ ఒకే టైమ్‌కు తెరవనున్నారు*
*అలాగే ఒకే టైమ్‌కు క్లోజ్చేయవచ్చు*


*దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ బ్యాంకులకు ఇది వర్తిస్తుంది*
*దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఒకే పనివేళ్లలో పనిచేనున్నాయి. ఈజ్ 2.0 ప్రోగ్రామ్‌లో (ఎన్‌హ్యాన్స్‌డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్) భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.*

*బ్యాంకర్స్ ప్యానెల్‌ ఇప్పటికే మూడు టైమింగ్ స్లాట్స్‌ను ప్రతిపాదించింది.*

 *ఉదయం 9 నుంచి సాయంత్రం 3 గంటల* *వరకు, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం* *4 గంటల వరకు, ఉదయం 11 గంటల నుంచి*
*5 గంటల వరకు అనేది టైమింగ్ స్లాట్స్.* 

*వీటిల్లో బ్యాంకులన్నీ నచ్చిన ఒక టైమింగ్ స్లా్‌ట్‌ను ఎంచుకోవలసి ఉంది.*

*బ్యాంకులకు మూడు టైమింగ్ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంది. ఒక ప్రాంతంలో ఒక బ్యాంక్ ఒక టైమ్‌ను ప్రారంభమైతే, మరొక బ్యాంక్ వేరొక టైమ్‌‌కు తెరుస్తున్నారు. దీంతో ఖాతాదారులు గందరగోళానికి గురవుతున్నారు.*

*అందువల్ల అన్ని బ్యాంకులకు ఒకే టైమ్‌ ఉండాలి భావిస్తున్నాం’ అని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) సీఈవో వి.జి.కన్నన్ తెలిపారు. దాదాపుగా చాలా వాణిజ్య బ్యాంకులు 10:30 లేదా 11 గంటలకు ఓపెన్ అవుతున్నాయని పేర్కొన్నారు.*

*🔸బ్యాంకులు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీతో చర్చించి అభిప్రాయాలు తెలియజేయాలని కన్నన్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఆర్థిక మంత్రి శాఖ, పీఎస్‌బీ చీఫ్‌ల మధ్య జరిగిన మీటింగ్‌లో ఈ అంశం చర్చకు వచ్చింది. తర్వాత ఐబీఏకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య మరో సమావేశం జరిగింది. దీని తర్వాత ఐబీఏ చైర్మన్ సారథ్యంలో బ్యాంకింగ్ టైమింగ్స్‌పై ఒక సబ్ కమిటీ ఏర్పాటైంది.*
®

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "బ్యాంకుల పనివేళల్లో మార్పు! ఇక అన్ని బ్యాంకులకు ఒకే టైమ్‌"

Post a Comment