నగదు రహిత 'ఆర్థికం' విఫలం..?
17 శాతం పెరిగిన నగదు చెలామణి
* ఆర్బిఐ తాజా నివేదికలో వెల్లడి
ముంబై : నోట్ల రద్దు సమయంలో మోడీ ప్రకటించిన నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది అమల్లో విఫలమైందా., అంటే అవుననే సమాధానం వస్తోంది. మార్చి, 2019 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ చలామణి దాదాపు 17 శాతం వరకూ పెరిగి రూ.21.1 లక్షలకు చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) తన తాజా 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. 2016లో బిజెపి ప్రభుత్వం చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ఆ సమయంలో ప్రజలు తీవ్ర నగదు కొరత ఎదుర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్స హించాలని ప్రజలకు సూచించింది
* ఆర్బిఐ తాజా నివేదికలో వెల్లడి
ముంబై : నోట్ల రద్దు సమయంలో మోడీ ప్రకటించిన నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అనేది అమల్లో విఫలమైందా., అంటే అవుననే సమాధానం వస్తోంది. మార్చి, 2019 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ చలామణి దాదాపు 17 శాతం వరకూ పెరిగి రూ.21.1 లక్షలకు చేరుకుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బిఐ) తన తాజా 2019 వార్షిక నివేదికలో పేర్కొంది. 2016లో బిజెపి ప్రభుత్వం చెలామణిలో ఉన్న పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ఆ సమయంలో ప్రజలు తీవ్ర నగదు కొరత ఎదుర్కొన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్స హించాలని ప్రజలకు సూచించింది
అయితే ప్రభుత్వం ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పులు రాలేదన్న విషయం ఆర్బిఐ నివేదిక ద్వారా తెలుస్తోంది. 500, 1000 నోట్ల రద్దు తర్వాత భారత ప్రభుత్వం కొత్త 500, 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో 2 వేల నోటు తర్వాత 500 నోటే పెద్దదిగా ఉంది. దీంతో ఈ నోటుకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న నగదు లో దాదాపు 51 శాతం వరకూ ఈ 500 నోట్లే ఎక్కువగా ఉన్నాయని ఆర్బిఐ నివేదిక వెల్లడించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో చెలామణిలో ఉన్న నగదు విలువ, పరిమాణం 17, 6.2 శాతాల చొప్పున పెరిగింది. అంటే కరెన్సీ చెలామణి విలువ రూ.21.1 లక్షల కోట్లు ఉండగా, 1,08,759 మిలియన్ నోట్లు చేతులు మారాయి.
రిటైల్ ఎలక్ట్రానిక్ చెల్లింపుల విలువ 59 శాతం పెరిగి, 23.3 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 2108, జూన్ చివరి నాటికి రూ.500 నోటు కరెన్సీ చెలామణిలో 42 శాతం ఉండగా, మరోవైపు రూ.2 వేల నోటు మాత్రం 2019, మార్చి నాటికి చెలామణిలో తన విలువను దిగజార్చుకొని రూ.6.58 కోట్లకు చేరు కుంది. మొత్తం మీద నగదు చెలామణిలో ఈ రూ.500, 2 వేల నోట్లు దాదాపు 82 శాతం మేర ఉన్నాయి. నకిలీ నోట్ల గుర్తింపులో కొంత మెరుగయ్యామని ఆర్బిఐ పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ నకిలీ నోట్ల గుర్తింపు రు.7.62 లక్షల మేరకు ఉండగా, 2017-18లో 5.22 లక్షలకు తగ్గి, 2018-19 నాటికి 3.17 లక్షలకు పడిపోయిందని తెలిపింది. దీంతో పాటు నోట్లను ముద్రించేందుకు అయ్యే ఖర్చు కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. 2017-18లో ఈ ఖర్చు రూ.4,912 కోట్లు ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.4,811కు తగ్గిందని ఆర్బిఐ తెలిపింది. రద్దైన పెద్ద నోట్లను అదీనంలోకి తీసుకున్న తర్వాత చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్బిఐ వెల్లడించింది. అయినా కూడా దాదాపు 21 వేల మేర నకిలీ రూ.500, 2 వేల నోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లభ్యమయ్యాయని తెలిపింది. నోట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు ఆర్బిఐ ఇటీవల వార్నిష్డ్ రూ.100 నోట్లను తీసుకువచ్చే ఒక ప్రయోగాత్మక యత్నానికి శ్రీకారం చుట్టింది. త్వరలో వీటిని వికలాంగు లకు అనుకూలంగా మార్చేందుకు ఉన్న మార్గాలను కూడా అన్వేషిస్తోంది.
2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు, ఇతర కారణాలను చూపి అప్పట్లో ప్రభుత్వం ఈ పనికి పూనుకుంది. ఈ నేపథ్యంలో రద్దైన నోట్లలో దాదాపు 99.8 శాతం నోట్లను ప్రజలు బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు. అయితే వారి సాధారణ జీవన విధానానికి నగదు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో విలువ కలిగిన చిన్ననోట్ల కోసం ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో తోపులాటలు జరిగి కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం సాధారణ ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. దీంతో పాటు చిన్న పరిశ్రమలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో అనేక మంది కార్మికులు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయ హేతుబద్ధతపై అనేక మంది మేధావులు, ప్రజలు ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు
రిటైల్ ఎలక్ట్రానిక్ చెల్లింపుల విలువ 59 శాతం పెరిగి, 23.3 బిలియన్లకు చేరుకుందని నివేదిక పేర్కొంది. 2108, జూన్ చివరి నాటికి రూ.500 నోటు కరెన్సీ చెలామణిలో 42 శాతం ఉండగా, మరోవైపు రూ.2 వేల నోటు మాత్రం 2019, మార్చి నాటికి చెలామణిలో తన విలువను దిగజార్చుకొని రూ.6.58 కోట్లకు చేరు కుంది. మొత్తం మీద నగదు చెలామణిలో ఈ రూ.500, 2 వేల నోట్లు దాదాపు 82 శాతం మేర ఉన్నాయి. నకిలీ నోట్ల గుర్తింపులో కొంత మెరుగయ్యామని ఆర్బిఐ పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ నకిలీ నోట్ల గుర్తింపు రు.7.62 లక్షల మేరకు ఉండగా, 2017-18లో 5.22 లక్షలకు తగ్గి, 2018-19 నాటికి 3.17 లక్షలకు పడిపోయిందని తెలిపింది. దీంతో పాటు నోట్లను ముద్రించేందుకు అయ్యే ఖర్చు కూడా తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. 2017-18లో ఈ ఖర్చు రూ.4,912 కోట్లు ఉండగా, 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.4,811కు తగ్గిందని ఆర్బిఐ తెలిపింది. రద్దైన పెద్ద నోట్లను అదీనంలోకి తీసుకున్న తర్వాత చిన్న నోట్లను ఎక్కువగా ముద్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్బిఐ వెల్లడించింది. అయినా కూడా దాదాపు 21 వేల మేర నకిలీ రూ.500, 2 వేల నోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో లభ్యమయ్యాయని తెలిపింది. నోట్ల జీవిత కాలాన్ని పెంచేందుకు ఆర్బిఐ ఇటీవల వార్నిష్డ్ రూ.100 నోట్లను తీసుకువచ్చే ఒక ప్రయోగాత్మక యత్నానికి శ్రీకారం చుట్టింది. త్వరలో వీటిని వికలాంగు లకు అనుకూలంగా మార్చేందుకు ఉన్న మార్గాలను కూడా అన్వేషిస్తోంది.
2016, నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రకటించింది. నల్లధనాన్ని అరికట్టేందుకు, ఇతర కారణాలను చూపి అప్పట్లో ప్రభుత్వం ఈ పనికి పూనుకుంది. ఈ నేపథ్యంలో రద్దైన నోట్లలో దాదాపు 99.8 శాతం నోట్లను ప్రజలు బ్యాంకులకు తిరిగి ఇచ్చేశారు. అయితే వారి సాధారణ జీవన విధానానికి నగదు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో విలువ కలిగిన చిన్ననోట్ల కోసం ప్రజలు బ్యాంకులు, ఎటిఎంల వద్ద బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో తోపులాటలు జరిగి కొంతమంది చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. నోట్ల రద్దు నిర్ణయం సాధారణ ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేసింది. దీంతో పాటు చిన్న పరిశ్రమలు దివాళా తీశాయి. ఈ నేపథ్యంలో అనేక మంది కార్మికులు జీవనోపాధి లేక రోడ్డున పడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయ హేతుబద్ధతపై అనేక మంది మేధావులు, ప్రజలు ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు
0 Response to "నగదు రహిత 'ఆర్థికం' విఫలం..?"
Post a Comment