ట్రిపుల్ ఐటీ సీట్ల ఎంపిక జాబితా విడుదల
3743 మంది విద్యారులకు అవకాశం
వేంపల్లె: ఏపీలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు ట్రీపుల్ ఐటీల్లో ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు అడ్మిషన్ కౌన్సెలింగ్ కన్వీనర్ గోపాల్రాజు జాబితాను విడుదల చేశారు
. ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రీపుల్ఐటీలకు స్పెషల్ క్యాటగిరి సీట్లను మినహాయించి, 3743 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు 0.3 గ్రేడ్ పాయింట్లు వెయిటేజీగా కలిపి రిజర్వేషన్ ప్రాతిపదికన ఎం పిక చేశారు.
జాబితా వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్జీయూకేటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి 8వ తేదీవరకు ట్రీపుల్ఐటీలకు ఎంపికైన విద్యార్థులకు ఇడుపులపాయ, నూజివీడు ట్రీపుల్ ఐటీ క్యాంప్సలలో ప్రవేశాల ప్రక్రియ నిర్వహిచనున్నట్లు కన్వీనర్ తెలిపారు
0 Response to "ట్రిపుల్ ఐటీ సీట్ల ఎంపిక జాబితా విడుదల"
Post a Comment