ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల

అమరావతి: ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ విశ్వజిత్‌ ఈ ఫలితాలను వెల్లడించారు. 64,575 మంది అభ్యర్థులు తుది పరీక్ష రాయగా.. 58007 మంది అర్హత సాధించారని చెప్పారు. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్స్‌ను మంగళవారం ఉదయం వెబ్‌సైట్‌లో ఉంచుతామని విశ్వజిత్‌ తెలిపారు




జవాబు పత్రాల పునఃపరిశీలన కోసం కోరేవారు దరఖాస్తు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఆగస్ట్‌ 1వ తేదీ సాయంత్రం లోపు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలన్నారు

  • అర్హత సాధించిన 58,007 మంది అభ్యర్థులు
  • నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఓఎంఆర్‌ షీట్లు
అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష తుది ఫలితాలను ఏపీ పోలీసుశాఖ సోమవారం విడుదల చేసింది. మొత్తం 64,575మందికి గాను 58,007మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మంగళవారం బోర్డు వెబ్‌ సైట్‌లో పెడతామని చైౖర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ పేర్కొన్నారు. జవాబు పత్రాలను పునఃపరిశీలన కోరేవారు రూ.1000 ఫీజుతో ఈ నెల 30 నుంచి ఆగస్టు 1లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కాగా, గత ఏడాది నవంబరు 12న ఈ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా 4లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.
 
ప్రాథమిక ప్రవేశ పరీక్ష, దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పరీక్షల అనంతరం ఈ ఏడాది మార్చి 17న తుది పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో జరిగిన పరీక్షకు 59,358మంది పురుష, 5217మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 53,509మంది పురుష, 4498మంది మహిళా అభ్యర్థులు అర్హత మార్కులు సాధించారు. ఓసీలు 3560మంది, బీసీలు 32,668, ఎస్సీలు 17,289, ఎస్టీలు 4670మంది అర్హత సాధించినట్లు విశ్వజీత్‌ వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల"

Post a Comment